వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుతో పాటు పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే, అనారోగ్య కారణాల నేపథ్యంలో వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. అయితే, తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది.
విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత ఏడాది జులైలో వంశీతోపాటు ఆయన అనుచరులు తనను బెదిరించి దాడికి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలు సెక్షన్ల కింద వంశీతో సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. వంశీతో పాటు ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ దాడిలో అప్పుడు టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్థన్ ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నారు. హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆ కేసుకు కీలకంగా మారింది. దీంతో, సత్యవర్థన్ ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…