వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుతో పాటు పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే, అనారోగ్య కారణాల నేపథ్యంలో వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. అయితే, తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది.
విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత ఏడాది జులైలో వంశీతోపాటు ఆయన అనుచరులు తనను బెదిరించి దాడికి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలు సెక్షన్ల కింద వంశీతో సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. వంశీతో పాటు ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ దాడిలో అప్పుడు టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్థన్ ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నారు. హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆ కేసుకు కీలకంగా మారింది. దీంతో, సత్యవర్థన్ ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on December 18, 2025 2:45 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…