వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుతో పాటు పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే, అనారోగ్య కారణాల నేపథ్యంలో వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. అయితే, తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది.
విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత ఏడాది జులైలో వంశీతోపాటు ఆయన అనుచరులు తనను బెదిరించి దాడికి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలు సెక్షన్ల కింద వంశీతో సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. వంశీతో పాటు ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ దాడిలో అప్పుడు టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్థన్ ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నారు. హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆ కేసుకు కీలకంగా మారింది. దీంతో, సత్యవర్థన్ ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on December 18, 2025 2:45 pm
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…