‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. బుధవారం ఏపీ సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పనితీరును సీఎం ప్రశంసించారు. పరిపాలన అనుభవం లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారంలో పవన్ చూపుతున్న చొరవ అభినందనీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ దిశగా పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని సీఎం తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ రోడ్ల నిర్మాణాల విషయంలో ఆయన తీసుకుంటున్న తక్షణ నిర్ణయాలను ఉదాహరణలతో వివరించారు. ఇటీవల అంధుల క్రికెట్ టోర్నీ విజేతలను అభినందించిన సందర్భంగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి తమ గ్రామానికి రహదారి వేయాలని కోరగానే వెంటనే నిధులు మంజూరు చేయడం పవన్ స్పందనకు నిదర్శనమని చెప్పారు. ఇదే తరహాలో మరో సంఘటనను కూడా కలెక్టర్ల సమక్షంలో ప్రస్తావించారు.
మంగళవారం కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసిన సందర్భంగా అల్లూరి జిల్లాకు చెందిన ఓ గిరిజన యువకుడు తమ గ్రామానికి రహదారి కావాలని కోరగా, ఆ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మీటింగ్ ముగిసేలోగా రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేయించిన విధానాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. బాధ్యత గల ప్రభుత్వం అధికారాలను దుర్వినియోగం చేయకుండా ప్రజల అవసరాలకు సద్వినియోగం చేయాలన్నదే తమ పాలన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…