Political News

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆమె స‌మాధానం చెప్పారు. ఒక‌రు స్పందిస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా? అని అడ‌గ్గా.. త‌ప్ప‌కుండా చేస్తానన్నారు. ఆమె 2029లో జ‌రిగే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. అంటే.. పార్ల‌మెంటుకు క‌విత పోటీ చేస్తార‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు 2028లో జ‌ర‌గ‌నున్నాయి. సో.. ఆమె మాత్రం 2029లో పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంగ‌మ‌నార్హం.

మ‌రో నెటిజ‌న్ స్పందిస్తూ.. విద్య వ్యాపారం అయింద‌ని, మీరు ముఖ్య‌మంత్రి అయితే.. ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించ‌గా…. తాము అధికారంలోకి వ‌స్తే.. విద్య‌ను మ‌రింత చేరువ చేస్తామన్నారు. పేరెంట్ల‌పై ఎలాంటి ఆర్థిక భారం కాని విధంగా విద్య‌ను అందిస్తామన్నారు. ప్ర‌స్తుత దోపిడీ విధానానికి తాము వ్య‌తిరేక‌మన్న క‌విత‌.. దీనిపై స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. పిల్లల  చదువుల కోసం తల్లిదండ్రులు రూపాయి కూడా కట్టకుండా కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచితంగా అందిస్తామ‌న్నారు.  

ఇక‌, రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై కొంద‌రు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ.. తాను కూడా ఈవిష‌యంలో చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టు క‌విత చెప్పారు. ఆదిలాబాద్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ప‌త్తి రైతులు కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్న వ్య‌వ‌హారం తెలిసి చ‌లించిపోయాన‌న్నారు. అయితే.. ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం, ఉదాసీన‌త కార‌ణంగానే రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని క‌విత వ్యాఖ్యానించారు. రైతుల‌కు మేలు చేసేలా తామునిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని చెప్పారు.  

సీఎం రేవంత్‌రెడ్డి పాల‌న‌, ఆయన వ్య‌వ‌హార తీరుపై మీరేమంటారంటూ.. నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు క‌విత ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. “హామీల‌ను బుట్ట‌దాఖ‌లు చేశారు. నిబ‌ద్ధ‌త‌ను నిరూపించుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి ప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర నిరాశ నిస్పృహ‌ల్లో ఉన్నారు“ అని క‌విత పేర్కొన్నారు. (Broken promises, Failed commitments, People absolutely are dissappointed with the government).

కాగా.. మ‌రో నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. జాగృతి సంస్థ‌ను స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రి సాధికార‌త‌కు కృషి చేసేలా చేరువ చేస్తామ‌ని క‌విత చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు స‌హా అన్ని సామాజిక వ‌ర్గాలకూ జాగృతిని చేరువ చేస్తూ..క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

This post was last modified on December 15, 2025 10:21 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Kavitha

Recent Posts

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

55 minutes ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

1 hour ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

1 hour ago

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

2 hours ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

2 hours ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

3 hours ago