Political News

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆమె స‌మాధానం చెప్పారు. ఒక‌రు స్పందిస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా? అని అడ‌గ్గా.. త‌ప్ప‌కుండా చేస్తానన్నారు. ఆమె 2029లో జ‌రిగే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. అంటే.. పార్ల‌మెంటుకు క‌విత పోటీ చేస్తార‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు 2028లో జ‌ర‌గ‌నున్నాయి. సో.. ఆమె మాత్రం 2029లో పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంగ‌మ‌నార్హం.

మ‌రో నెటిజ‌న్ స్పందిస్తూ.. విద్య వ్యాపారం అయింద‌ని, మీరు ముఖ్య‌మంత్రి అయితే.. ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించ‌గా…. తాము అధికారంలోకి వ‌స్తే.. విద్య‌ను మ‌రింత చేరువ చేస్తామన్నారు. పేరెంట్ల‌పై ఎలాంటి ఆర్థిక భారం కాని విధంగా విద్య‌ను అందిస్తామన్నారు. ప్ర‌స్తుత దోపిడీ విధానానికి తాము వ్య‌తిరేక‌మన్న క‌విత‌.. దీనిపై స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. పిల్లల  చదువుల కోసం తల్లిదండ్రులు రూపాయి కూడా కట్టకుండా కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచితంగా అందిస్తామ‌న్నారు.  

ఇక‌, రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై కొంద‌రు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ.. తాను కూడా ఈవిష‌యంలో చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టు క‌విత చెప్పారు. ఆదిలాబాద్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ప‌త్తి రైతులు కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్న వ్య‌వ‌హారం తెలిసి చ‌లించిపోయాన‌న్నారు. అయితే.. ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం, ఉదాసీన‌త కార‌ణంగానే రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని క‌విత వ్యాఖ్యానించారు. రైతుల‌కు మేలు చేసేలా తామునిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని చెప్పారు.  

సీఎం రేవంత్‌రెడ్డి పాల‌న‌, ఆయన వ్య‌వ‌హార తీరుపై మీరేమంటారంటూ.. నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు క‌విత ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. “హామీల‌ను బుట్ట‌దాఖ‌లు చేశారు. నిబ‌ద్ధ‌త‌ను నిరూపించుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి ప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర నిరాశ నిస్పృహ‌ల్లో ఉన్నారు“ అని క‌విత పేర్కొన్నారు. (Broken promises, Failed commitments, People absolutely are dissappointed with the government).

కాగా.. మ‌రో నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. జాగృతి సంస్థ‌ను స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రి సాధికార‌త‌కు కృషి చేసేలా చేరువ చేస్తామ‌ని క‌విత చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు స‌హా అన్ని సామాజిక వ‌ర్గాలకూ జాగృతిని చేరువ చేస్తూ..క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

Kumar

Recent Posts

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

27 seconds ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

2 hours ago

చివరి గీతం… ‘గాన కోకిల’ జానకి ఇక లేరు

సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…

2 hours ago

తెలంగాణ హంత‌కుడిది – జ‌గ‌న్‌ది ఒకే పోలిక‌: చంద్ర‌బాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఓ వ్య‌క్తి ఆరుగురిని…

3 hours ago

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

6 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

6 hours ago