ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో జరిగిన భేటీలో ఈ అంశం ప్రస్తావనకు రాగానే ఆయన దానిని నోట్ చేసుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం అంధ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన సమావేశంలో దీపిక తన గ్రామమైన తంబలహెట్టి రోడ్డు సమస్యను వివరించగా, ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. క్రీడాకారిణి విజ్ఞప్తిని గమనించిన పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేసి, రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.
దీంతో శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి ప్రాంతాన్ని పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టి వరకు సుమారు ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలకు ఉప ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో, జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.
మధ్యాహ్నం వినిపించిన ఒక విజ్ఞప్తికి సాయంత్రానికే ఆమోదం లభించడంతో ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాకారుల సమస్యలపై ఇంత వేగంగా స్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on December 13, 2025 7:47 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…