బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై మంత్రి కొండా సురేఖ కొద్ది నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో నాగార్జున ఆ కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ, కేటీఆర్ పై మాత్రం న్యాయపోరాటం చేస్తానని సురేఖ అన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో కొండా సురేఖకు భారీ షాక్ తగిలింది.
కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేటీఆర్ వేసిన కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా విచారణకు కొండా సురేఖ హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. కాగా, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన క్రమంలో కొండా సురేఖను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి, మంత్రి హోదాలో ఉన్న సురేఖ ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ పై న్యాయపరంగా ఏ విధంగా ముందుకు పోతారు అన్నది ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…