Trends

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు ఇచ్చే బీసీసీఐ కాంట్రాక్టులలో భాగంగా, ఈసారి వీరిద్దరికీ రెండు కోట్ల రూపాయల తగ్గింపు ఉండవచ్చని సమాచారం. దీనికి కారణం వారి ఫామ్ కాదు, ఫార్మాట్ ఎంపిక. టెస్టు క్రికెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న బోర్డు నిబంధనలే ఈ కోతకు దారి తీస్తున్నాయి.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు A+ ప్లస్ (7 కోట్లు) A (5 కోట్లు), B, C అనే నాలుగు గ్రేడ్లుగా ఉంటాయి. ఇందులో A+ కేటగిరీ కేవలం మూడు ఫార్మాట్లలో అంటే టెస్టు, వన్డే, టీ20లలో రెగ్యులర్ గా ఆడే టాప్ ప్లేయర్ల కోసం మాత్రమే ఉద్దేశించింది. ఆటగాడి ఫామ్, జట్టుకు అతని కట్టుబాటు ఆధారంగా ఈ కాంట్రాక్టు గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. రిటైరర్ షిప్ తో సంబంధం లేకుండా ఆడిన ప్రతి మ్యాచ్‌కు వేతనం అదనంగా చెల్లిస్తారు.

రోహిత్ కోహ్లీ ప్రస్తుతం A+ గ్రేడ్ లో ఉన్నారు. అయితే వీరిద్దరూ టెస్టు టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో వారు A+ కేటగిరీకి అనర్హులు అయ్యే ఛాన్స్ ఉంది. బోర్డు నియమాల ప్రకారం, టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీంతో వారు A+ నుంచి ఏ కేటగిరీకి డెమోట్ అయితే, వారి వార్షిక రిటైరర్ షిప్‌లో రెండు కోట్ల రూపాయలు తగ్గుతుంది. వీరిద్దరూ తప్పుకోవడంతో శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాడు A+ కేటగిరీకి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది.

రవీంద్ర జడేజా కూడా టీ20ల నుంచి రిటైర్ అయినా, టెస్టుల్లో చురుకుగా పాల్గొంటున్నందున అతను A+ లోనే కొనసాగవచ్చు. మరోవైపు, దేశవాళీ క్రికెట్‌ను పట్టించుకోని శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లను గతంలో బోర్డు కాంట్రాక్టుల నుంచి తప్పించడం జరిగింది. ఈ కాంట్రాక్టు విధానం ద్వారా బీసీసీఐ ఒక బలమైన సందేశం ఇస్తోంది. ఆటగాడి హోదా ఎంత పెద్దదైనా, జాతీయ జట్టుకు ముఖ్యంగా టెస్టు క్రికెట్‌కు చూపించే నిబద్ధతే ముఖ్యం. అలాగే ఇకపై ఐపీఎల్ చూసుకుంటే కుదరదు. టెస్టులకి కమిట్‌మెంట్ ఇవ్వని వాళ్లకి జీతం కట్ చేస్తామని బోర్డు తేల్చేసింది.

This post was last modified on December 11, 2025 5:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

27 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

47 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago