Political News

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్‌కు ఓట‌ర్లు క్యూక‌ట్టారు. ప‌ల్లేక‌దా.. అని ఓట‌ర్లు లైట్ తీసుకోలేదు. ఎక్క‌డెక్క‌డి నుంచో వచ్చి.. త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వ‌చ్చిన వారు ఉన్నారు. మొత్తంగా పంచ‌య‌తీల్లో తొలి ద‌శ పోరు స‌క్ర‌మంగా.. స‌జావుగా సాగిపోయింది.

ఇదిలావుంటే.. పోలింగ్ ముగిసిన వెంట‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు అధికారులు లెక్కింపు చేప‌ట్టారు. తొలి అర గంట‌లోనే దాదాపు ఫ‌లితం వ‌చ్చేసింది. దీనిలో కాంగ్రెస్ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపించింది. మెజారిటీ ప‌ల్లెల‌ను కాంగ్రెస్‌పార్టీ సానుభూతిప‌రులు, ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా ఉన్న నాయ‌కులు ద‌క్కించుకున్నారు. ఇక‌, బీఆర్ ఎస్ దాదాపు చాలా వెనుక‌బ‌డింద‌నే చెప్పాలి.

కాంగ్రెస్ వంద‌ల సంఖ్య‌లో ప‌ల్లెల‌ను ద‌క్కించుకుంటే.. బీఆర్ ఎస్ పార్టీ కేవ‌లం ప‌దుల సంఖ్య‌లోనే ప‌ల్లెల్లో త‌న అస్థిత్వాన్ని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. ఇక‌, ఇత‌ర పార్టీలు కూడా.. త‌మ స‌త్తా చాటుకున్నాయ‌నే చెప్పాలి. వెర‌సి మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి భావించిన‌ట్టుగా ప‌ల్లెల్లోనూ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకే ద‌న్నుగా నిలిచార‌ని చెప్పాలి.

కార‌ణాలు ఇవేనా?

కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు దారుల‌ను భారీ సంఖ్య‌లో గెలిపించ‌డం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ‌న ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లకు విశ్వాసం ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం ఫ్యూచ‌ర్ సిటీ నుంచి పెట్టుబ‌డుల వ‌ర‌కు, పేద‌ల నుంచి రైతుల వ‌ర‌కు తీసుకుంటున్న కార్య‌క్ర‌మాలు, ప్ర‌క‌ట‌న‌లు వంటివి ప్ర‌భావం చూపుతున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, బీఆర్ఎస్ విష‌యానికి వ‌స్తే.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, క‌విత చేస్తున్న‌యుద్ధం వంటివిప్ర‌జ‌ల‌పై పెద్ద ఎత్తున ప్ర‌భావం చూపుతున్నాయ‌న్న చ‌ర్చ కూడా తెర‌మీద‌కి వ‌చ్చింది.

This post was last modified on December 11, 2025 6:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

6 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

43 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago