వైసీపీ వాళ్లు ఇక మూడు రాజధానుల మాటెత్తరేమో..? తమ కొంప ముంచిన ఆ విధానంపై ఇక మాట్లాడరేమో..? ఆ పేరు చెప్పి అమరావతిని నిర్వీర్యం చేసి, కాలం వెళ్లదీసిన వైసీపీ అధినేత జగన్కు కూడా ఆ మాట ఎత్తక పోవడం అదే సమాధానంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రాజధానిలో ఇల్లు కట్టుకుని ఉంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో అమరావతిపై అక్కసు పెంచుకున్నారు. మూడు రాజధానులు తమ విధానం అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
అమరావతిని పాలన రాజధానిగా, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని అన్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అమరావతిలో ఉవ్వెత్తున నిరసనలు ఎగిసిపడ్డాయి. దానికి పోటీగా వైసీపీ అనుకూలురు సైతం మూడు రాజధానుల పేరిట శిబిరాలు ఏర్పాటు చేశారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ఓటమికి మూడు రాజధానుల అశం కూడా ఒక కారణం అని భావిస్తున్నారు. నిన్నటి విలేకరుల సమావేశంలో మూడు రాజధానుల అంశంపై ఓ విలేకరి జగనను ప్రశ్నించారు. దానికి ఆన్సర్చెప్పకుండా ఇప్పటికే టైం అయిపోయిందంటూ జగన్దాటవేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాన్ని పునర్మిర్మించడానికి కంకణం కట్టుకుంది. దీనికి అటు కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం లభిస్తోంది. దీంతో కొద్ది కాలంలోనే రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నిధులు కూడా సమకూరుతున్నాయి. ఇదంతా వైసీపీకి మింగుడు పడకుండా ఉంది. స్పష్టం చెప్పకపోయినా మూడు రాజధానుల అంశం ఇక ముగిసిపోయిన అధ్యాయం అనే భావిస్తున్నట్లు ఉంది.
అమరావతిని ఒకప్పుడు శ్మశానం అని అన్న వైసీపీ సీనియర్నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సైతం మాట మార్చారు. ప్రస్తుతానికి త్రీ క్యాపిటెల్పై నోరెత్తడం లేదు. ప్రస్తుతానికి రాజధాని అమరావతే అంటూ శాసన మండలిలో ప్రకటించారు. గతంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన వైసీపీ ఇప్పుడు దానిపై మౌనం వహిస్తోంది. గత ఎన్నికల్లో తమకు జరిగిన డ్యామేజిని గుర్తు చేసుకుని ఇకపై ఆ ఊసు ఎత్తదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మూడు రాజధానులు ఒక ఫైయిల్యూర్ నిర్ణయం అని వైసీపీ కూడా భావిస్తున్నట్లుగా ఉంది. మరోవైపు దూసుకుపోతున్న అమరావతిపై కూడా ఏం మాట్లాడాలో.. ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని స్థితిలో ఉంది. ఒకప్పుడు అమరావతి ఉద్యమాన్ని అణిచివేసిన వైసీపీ ఇప్పుడు రాజధాని రైతుల రిటర్నబుల్ప్లాట్ల గురించి మాట్లాడడడం.. హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. రాజధాని అంశంపై వైసీపీ ఇప్పటికీ.. ఎప్పటికీ డైలమాలో ఉండడం ఆ పార్టీ ఎంతో కొంత నష్టం చేకూర్చే అంశమే…!
This post was last modified on December 5, 2025 12:53 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…