Political News

ఇక మూడు రాజధానుల మాటెత్తరేమో…?

వైసీపీ వాళ్లు ఇక మూడు రాజధానుల మాటెత్తరేమో..? తమ కొంప ముంచిన ఆ విధానంపై ఇక మాట్లాడరేమో..?  ఆ పేరు చెప్పి అమరావతిని నిర్వీర్యం చేసి, కాలం వెళ్లదీసిన వైసీపీ అధినేత జగన్కు కూడా ఆ మాట ఎత్తక పోవడం అదే సమాధానంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రాజధానిలో ఇల్లు కట్టుకుని ఉంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో అమరావతిపై అక్కసు పెంచుకున్నారు. మూడు రాజధానులు తమ విధానం అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

అమరావతిని పాలన రాజధానిగా, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని అన్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అమరావతిలో ఉవ్వెత్తున నిరసనలు ఎగిసిపడ్డాయి. దానికి పోటీగా వైసీపీ అనుకూలురు సైతం మూడు రాజధానుల పేరిట శిబిరాలు ఏర్పాటు చేశారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ఓటమికి మూడు రాజధానుల అశం కూడా ఒక కారణం అని భావిస్తున్నారు. నిన్నటి విలేకరుల సమావేశంలో మూడు రాజధానుల అంశంపై ఓ విలేకరి జగనను ప్రశ్నించారు. దానికి ఆన్సర్చెప్పకుండా ఇప్పటికే టైం అయిపోయిందంటూ జగన్దాటవేశారు.  

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాన్ని పునర్మిర్మించడానికి కంకణం కట్టుకుంది. దీనికి అటు కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం లభిస్తోంది. దీంతో కొద్ది కాలంలోనే రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నిధులు కూడా సమకూరుతున్నాయి. ఇదంతా వైసీపీకి మింగుడు పడకుండా ఉంది. స్పష్టం చెప్పకపోయినా మూడు రాజధానుల అంశం ఇక ముగిసిపోయిన అధ్యాయం అనే భావిస్తున్నట్లు ఉంది.

అమరావతిని ఒకప్పుడు శ్మశానం అని అన్న వైసీపీ సీనియర్నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సైతం మాట మార్చారు. ప్రస్తుతానికి త్రీ క్యాపిటెల్పై నోరెత్తడం లేదు. ప్రస్తుతానికి రాజధాని అమరావతే అంటూ శాసన మండలిలో ప్రకటించారు. గతంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన వైసీపీ ఇప్పుడు దానిపై మౌనం వహిస్తోంది. గత ఎన్నికల్లో తమకు జరిగిన డ్యామేజిని గుర్తు చేసుకుని ఇకపై ఆ ఊసు ఎత్తదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మూడు రాజధానులు ఒక ఫైయిల్యూర్ నిర్ణయం అని వైసీపీ కూడా భావిస్తున్నట్లుగా ఉంది. మరోవైపు దూసుకుపోతున్న అమరావతిపై కూడా ఏం మాట్లాడాలో.. ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని స్థితిలో ఉంది. ఒకప్పుడు అమరావతి ఉద్యమాన్ని అణిచివేసిన వైసీపీ ఇప్పుడు రాజధాని రైతుల రిటర్నబుల్ప్లాట్ల గురించి మాట్లాడడడం.. హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. రాజధాని అంశంపై వైసీపీ ఇప్పటికీ.. ఎప్పటికీ డైలమాలో ఉండడం ఆ పార్టీ ఎంతో కొంత నష్టం చేకూర్చే అంశమే…!

This post was last modified on December 5, 2025 12:53 pm

Share

Recent Posts

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

42 seconds ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago