Political News

ఇక మూడు రాజధానుల మాటెత్తరేమో…?

వైసీపీ వాళ్లు ఇక మూడు రాజధానుల మాటెత్తరేమో..? తమ కొంప ముంచిన ఆ విధానంపై ఇక మాట్లాడరేమో..?  ఆ పేరు చెప్పి అమరావతిని నిర్వీర్యం చేసి, కాలం వెళ్లదీసిన వైసీపీ అధినేత జగన్కు కూడా ఆ మాట ఎత్తక పోవడం అదే సమాధానంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రాజధానిలో ఇల్లు కట్టుకుని ఉంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో అమరావతిపై అక్కసు పెంచుకున్నారు. మూడు రాజధానులు తమ విధానం అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

అమరావతిని పాలన రాజధానిగా, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని అన్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అమరావతిలో ఉవ్వెత్తున నిరసనలు ఎగిసిపడ్డాయి. దానికి పోటీగా వైసీపీ అనుకూలురు సైతం మూడు రాజధానుల పేరిట శిబిరాలు ఏర్పాటు చేశారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ఓటమికి మూడు రాజధానుల అశం కూడా ఒక కారణం అని భావిస్తున్నారు. నిన్నటి విలేకరుల సమావేశంలో మూడు రాజధానుల అంశంపై ఓ విలేకరి జగనను ప్రశ్నించారు. దానికి ఆన్సర్చెప్పకుండా ఇప్పటికే టైం అయిపోయిందంటూ జగన్దాటవేశారు.  

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాన్ని పునర్మిర్మించడానికి కంకణం కట్టుకుంది. దీనికి అటు కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం లభిస్తోంది. దీంతో కొద్ది కాలంలోనే రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నిధులు కూడా సమకూరుతున్నాయి. ఇదంతా వైసీపీకి మింగుడు పడకుండా ఉంది. స్పష్టం చెప్పకపోయినా మూడు రాజధానుల అంశం ఇక ముగిసిపోయిన అధ్యాయం అనే భావిస్తున్నట్లు ఉంది.

అమరావతిని ఒకప్పుడు శ్మశానం అని అన్న వైసీపీ సీనియర్నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సైతం మాట మార్చారు. ప్రస్తుతానికి త్రీ క్యాపిటెల్పై నోరెత్తడం లేదు. ప్రస్తుతానికి రాజధాని అమరావతే అంటూ శాసన మండలిలో ప్రకటించారు. గతంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన వైసీపీ ఇప్పుడు దానిపై మౌనం వహిస్తోంది. గత ఎన్నికల్లో తమకు జరిగిన డ్యామేజిని గుర్తు చేసుకుని ఇకపై ఆ ఊసు ఎత్తదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మూడు రాజధానులు ఒక ఫైయిల్యూర్ నిర్ణయం అని వైసీపీ కూడా భావిస్తున్నట్లుగా ఉంది. మరోవైపు దూసుకుపోతున్న అమరావతిపై కూడా ఏం మాట్లాడాలో.. ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని స్థితిలో ఉంది. ఒకప్పుడు అమరావతి ఉద్యమాన్ని అణిచివేసిన వైసీపీ ఇప్పుడు రాజధాని రైతుల రిటర్నబుల్ప్లాట్ల గురించి మాట్లాడడడం.. హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. రాజధాని అంశంపై వైసీపీ ఇప్పటికీ.. ఎప్పటికీ డైలమాలో ఉండడం ఆ పార్టీ ఎంతో కొంత నష్టం చేకూర్చే అంశమే…!

This post was last modified on December 5, 2025 12:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

2 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

3 hours ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

3 hours ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

4 hours ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

4 hours ago

మళ్లీ థియేటర్ల హాహాకారాలు

గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…

5 hours ago