తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖ లో రంగ నాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఈ రోజు ప్రకటించింది. ఆమె కొద్దిరోజుల కిందట సడన్ గా తెరపైకి వచ్చింది. ప్రజాజీవితంలో వసున్నట్టు ఆ రోజు ప్రకటించింది. రాజకీయ ఎంట్రీపై తర్వాత స్పందిస్తానన్న అప్పుడే చెప్పింది. సోదరుడు రాధాతో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించింది. మరోసారి అదే పునరుద్ఘాటించింది. మా అన్న వంగవీటి రాధాకృష్ణ తో ఎటువంటి విభేదాలు లేవు.. అనవసరంగా గాసిప్స్ ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాధా రంగ మిత్ర మండలి సభ్యులును చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా ఉందన్నారు. డిసెంబరు 26న విశాఖలో రంగా నాడు పేరు తో సభ పెట్టాం.. రంగా అభిమానులు కోసం నిర్వహించే సభ … అన్ని పార్టీ ల్లో ఉన్న అభిమానులు రావాలి అని పిలుపునిచ్చారు. తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏ పార్టీ తో ఇప్పుడు నాకు సంబంధం లేదని తెలిపారు. నా రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తరువాత చెబుతాను అన్నారు. నేను రేపు ఎటువంటి రాజకీయ ప్రకటన చేయడం లేదు, ఏ పార్టీ లో చేరడం లేదంటూ స్పష్టం చేశారు. రేపు విశాఖలో జరిగే సభకు వంగవీటి రాధాకృష్ణను ఆహ్వానించారు. అయితే ఆయన వస్తారో లేదో చూడాలి మరి…!
This post was last modified on December 4, 2025 11:30 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…