పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు గట్టి నమ్మకం ఏర్పడుతోందని ఆయన కుమారులు సులేమాన్, ఖాసీంలు పేర్కొనడంతో పాకిస్థాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ఇమ్రాన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏదో దాచిపెడుతోందంటూ.. ప్రతిపక్షాలు కూడా పార్లమెంటు ముందు ఆందోళనకు దిగడం మరింత చర్చనీయాంశం అయింది.
2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఇమ్రాన్ బంధీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సరైన ఆహారం ఇవ్వకపోవడం, ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఆయన మరణించారంటూ.. బలూచిస్తాన్ వేర్పాటు వాదులు అపస్మారక స్థితిలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను రెండు రోజుల కిందట పోస్టు చేశారు. ఇవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అప్పట్లోనే ఇమ్రాన్ సోదరీమణులు, ఆయన కుమారులు రావల్పిండిలోని జైలు వద్ద ఆందోళనకు రెడీ అయ్యారు.
అయితే.. ప్రభుత్వం వారిని నిలువరించింది. తాజాగా మాత్రం దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇమ్రాన్ మద్దతు దారులు రోడ్డెక్కారు. మరోవైపు రావల్పిండి బంద్కు ఇమ్రాన్ కుమారులు ఇద్దరూ పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది ప్రజలు రావల్పిండి రహదారులను నిర్బంధించారు. దీనిని ముందుగానే పసిగట్టిన షెహబాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం.. 144 సెక్షన్ విధించింది. అయినప్పటికీ ఆందోళన కారులు జైలు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఇదిలావుంటే.. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉంటున్నారని.. ఆయనకు ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీలను కల్పించామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ప్రస్తుత పరిణామాలపై మాత్రం మౌనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ను డెత్ సెల్లో ఉంచారన్న(చనిపోయిన వారిని ఉంచే కారాగారం) వార్తలు ఊపందుకున్నాయి.మరోవైపు.. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలెర్ట్ అయింది. పాక్ సరిహద్దుల వెంబడి.. మరింత భద్రతను పెంచింది.
This post was last modified on December 2, 2025 6:27 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…