Political News

పవన్ సారీ చెప్పకపోతే… సినిమాటోగ్రఫీ మినిస్టర్ వార్నింగ్

తెలంగాణ నాయకులు పదే పదే గోదారి పచ్చదనం గురించి మాట్లాడడం, దిష్టి తగలడం వల్లే పచ్చటి కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయి తలలు లేని మొండాలుగా మిగిలాయి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ వి మైండ్ లెస్ వ్యాఖ్యలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పటికే ఆ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే.

పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. పవన్‌ వ్యాఖ్యలు తనను బాధించాయని, పవన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి తగలడం కాదని, ఆంధ్రా పాలకుల వల్లే తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్‌ విషం తాగారని అన్నారు.

పవన్‌ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమా ఒక్కటి కూడా ఆడదని, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా చెబుతున్నానని హెచ్చరించారు. ఒక్క థియేటర్‌లో కూడా సినిమా విడుదల కాదని పవన్ కు వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి సూపర్‌ స్టార్‌ అని, ఆయన మంచోడని ప్రశంసించారు. రాజకీయ అనుభవం లేకే పవన్‌ ఇలా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Kumar

Recent Posts

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

42 minutes ago

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

3 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

4 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

5 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

7 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

8 hours ago