Political News

అమరావతి రెండో దశ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలో తెలుసా

ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 33 వేల ఎకరాల భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించారు. ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు సమీకరించిన చరిత్రలేదని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఇదిలావుండగా అమరావతిలోని అడవులు సహా ప్రభుత్వానికి మరో 20 వేల ఎకరాల భూమి ఉంది. దీంతో మొదటి దశలో 54 వేల ఎకరాలు అమరావతికి ఉన్నట్టయింది.

అయితే పెరుగుతున్న జనాభా, నగరాల విస్తీర్ణాన్ని శాసిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల క్రితం ఉన్న ప్లాన్‌ను రివైజ్ చేసుకున్న ప్రభుత్వం మరో 46 వేల ఎకరాల భూములను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులోనూ మరో 20 వేల ఎకరాలు ప్రభుత్వానికి చెందినవేనని అధికారులు చెబుతున్నారు. వీటిలో 10 వేల ఎకరాలు అటవీ ప్రాంతమని, దీనిని డీనోటిఫై చేయిస్తే అందుబాటులోకి వస్తుందని వెల్లడిస్తున్నారు. మొత్తంగా రెండో దశ అమరావతి విస్తరణలో ప్రభుత్వానికి కావాల్సింది కేవలం 26 వేల ఎకరాలే.

ఇందులోనూ రెండో దశలో 16,600 ఎకరాలను సేకరించనున్నారు. దీనిని సమీకరించేందుకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ తాజాగా జారీ చేశారు. తుళ్ళూరు, అమరావతి మండలాల్లోని ఆరు గ్రామాల నుంచి ఈ భూములను సేకరించనున్నారు. మలి దశలో మరో 10 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరిస్తారు.

తుళ్ళూరు మండలంలోని పెదపరిమి గ్రామంలో 6513.52 ఎకరాలు, వడ్లమనులో 1936.87 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2428.25 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తారు. అదేవిధంగా అమరావతి మండలంలోని వైకుంఠపురంలో 3361.48 ఎకరాలు, యండ్రాయిలో 2166.04 ఎకరాలు, కర్లపూడిలో 2944.10 ఎకరాలను సేకరించనున్నారు.

తలనొప్పులు రాకుండా…

రైతుల నుంచి రెండో దశలో సమీకరించే భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది. సమీకరణకు రైతులు అంగీకరించినట్టు ముందే వారి నుంచి అనుమతి పత్రాలు తీసుకుని, ప్రభుత్వ ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేయించనున్నారు.

అలాగే ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూములను సాగుకు అనుమతించకుండా నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో భూముల విషయంలో ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే అవకాశాలు లేకుండా, రాజధాని నిర్మాణానికి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

Satya

Recent Posts

ఏపీలో ‘లోకల్’ రంగం రెడీ!

ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…

4 hours ago

ఏపీలో మళ్లీ కరోనా కలకలం…?

యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…

5 hours ago

యంగ్ హీరోకు త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్ ఇచ్చిన షాక్

దేశంలో తెలుగు ప్రేక్ష‌కులంత పెద్ద మ‌న‌సు ఇంకెవ‌రికీ ఉండ‌దంటూ ఇత‌ర భాష‌ల ఫిలిం మేక‌ర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా త‌మిళ…

8 hours ago

వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!

ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…

10 hours ago

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…

11 hours ago

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

11 hours ago