Political News

‘చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు భూములు ఇచ్చారు’

కూట‌మి ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా ప‌నిచేస్తోంద‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం మెండుగా ఉంద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఒకే విడ‌త 15 బ్యాంకులు, ఇత‌ర బీమా కంపెనీల‌కు చెందిన కేంద్ర కార్యాల‌యాల నిర్మాణానికి భూమి పూజ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, సీఎం చంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు.

రాజ‌ధాని అమ‌రావ‌తిపై ప్ర‌జ‌ల‌కు అనేక ఆశ‌లు ఉన్నాయ‌ని ప‌వ‌న్ చెప్పారు. ఒకేచోట బ్యాంకులు, బీమా కంపెనీల కార్యాల‌యాల నిర్మాణంతో రాజ‌ధానికి కొత్త క‌ళ వ‌చ్చిన‌ట్టు అయింద‌ని తెలిపారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ధిని ప్ర‌ధానంగా తీసుకుని ప‌నిచేస్తోంద‌న్నారు. జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా ప‌నిచేస్తున్నామ‌ని తెలిపారు. ఆర్ధిక లావాదేవీల కేంద్రంగా అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయటం శుభసూచక‌మ‌ని పేర్కొన్నారు.

బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అరుదు అని పేర్కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. దానిని అమరావతి సాధించిందని తెలిపారు. ఈ కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం ఆర్ధికంగా అందరికీ ప్రయోజనం చేకూరుతుంద‌ని చెప్పారు. 13 వంద‌ల 34 కోట్ల రూపాయ‌ల‌ వ్యయంతో ఈ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి ఆర్ధిక భవిష్యత్ నిర్మాణానికి కీలకమ‌ని ఉద్ఘాటించారు.

ముఖ్య‌మంత్రి చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తు చేశారు. అది కూడా ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వ‌డం విశేష‌మ‌ని పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణం కోసం కేంద్రం ఎంతో స‌హ‌క‌రిస్తోంద‌ని తెలిపారు. అదేవిధంగా పోలవరం  నిర్మాణానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిల‌బెట్టేందుకు కూడా కేంద్రం అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తోంద‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అడుగడుగునా ఆదుకుంటున్న ప్రధాని మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

This post was last modified on November 29, 2025 10:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

1 hour ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

6 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

7 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

7 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

7 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

8 hours ago