Political News

‘చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు భూములు ఇచ్చారు’

కూట‌మి ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా ప‌నిచేస్తోంద‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం మెండుగా ఉంద‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఒకే విడ‌త 15 బ్యాంకులు, ఇత‌ర బీమా కంపెనీల‌కు చెందిన కేంద్ర కార్యాల‌యాల నిర్మాణానికి భూమి పూజ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, సీఎం చంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు.

రాజ‌ధాని అమ‌రావ‌తిపై ప్ర‌జ‌ల‌కు అనేక ఆశ‌లు ఉన్నాయ‌ని ప‌వ‌న్ చెప్పారు. ఒకేచోట బ్యాంకులు, బీమా కంపెనీల కార్యాల‌యాల నిర్మాణంతో రాజ‌ధానికి కొత్త క‌ళ వ‌చ్చిన‌ట్టు అయింద‌ని తెలిపారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ధిని ప్ర‌ధానంగా తీసుకుని ప‌నిచేస్తోంద‌న్నారు. జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా ప‌నిచేస్తున్నామ‌ని తెలిపారు. ఆర్ధిక లావాదేవీల కేంద్రంగా అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయటం శుభసూచక‌మ‌ని పేర్కొన్నారు.

బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అరుదు అని పేర్కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. దానిని అమరావతి సాధించిందని తెలిపారు. ఈ కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం ఆర్ధికంగా అందరికీ ప్రయోజనం చేకూరుతుంద‌ని చెప్పారు. 13 వంద‌ల 34 కోట్ల రూపాయ‌ల‌ వ్యయంతో ఈ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి ఆర్ధిక భవిష్యత్ నిర్మాణానికి కీలకమ‌ని ఉద్ఘాటించారు.

ముఖ్య‌మంత్రి చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తు చేశారు. అది కూడా ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వ‌డం విశేష‌మ‌ని పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణం కోసం కేంద్రం ఎంతో స‌హ‌క‌రిస్తోంద‌ని తెలిపారు. అదేవిధంగా పోలవరం  నిర్మాణానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిల‌బెట్టేందుకు కూడా కేంద్రం అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తోంద‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అడుగడుగునా ఆదుకుంటున్న ప్రధాని మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Kumar

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

16 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

48 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago