Political News

సోషల్ మీడియాపై సుప్రీమ్ కోర్టు సంచనల నిర్ణయం

యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఏది పడితే అది మాట్లాడతాం, ఏ వీడియో పడితే అది అప్‌లోడ్ చేస్తాం అంటే ఇక కుదరదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌పై ఒక కన్నేసి ఉంచేందుకు కొత్త చట్టాలు రాబోతున్నాయి. యూజర్ జనరేటెడ్ కంటెంట్‌పై నియంత్రణ లేకపోవడంతో జరుగుతున్న అనర్థాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. “ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే” అంటూ కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. 4 వారాల్లోగా దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ తేవాలని ఆదేశించింది.

సమయ్ రైనా, రణ్‌వీర్ అల్లాబాడియా లాంటి యూట్యూబర్స్ చేసిన షోలు (‘India’s Got Latent’) వివాదాస్పదమవ్వడంతో ఈ చర్చ మొదలైంది. కోర్టులో వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఇది కేవలం అశ్లీలత మాత్రమే కాదు, వికృత ప్రవర్తన కూడా అని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది చూపించలేమని కోర్టు అభిప్రాయపడింది. యాంటీ నేషనల్ కంటెంట్, వికలాంగులను కించపరిచే వీడియోలు వైరల్ అవుతుంటే చూస్తూ ఊరుకోలేమని జడ్జీలు స్పష్టం చేశారు.

ముఖ్యంగా సమయ్ రైనా ఇష్యూలో.. వికలాంగులను కించపరిచినందుకు అతను డబ్బులు ఇస్తే సరిపోదు, వాళ్లకు కావాల్సింది గౌరవం అని కోర్టు చెప్పింది. ఎస్సీ/ఎస్టీ చట్టం లాగే వికలాంగులను అవమానిస్తే కఠిన శిక్షలు ఉండేలా చట్టం ఎందుకు తేకూడదు అని కేంద్రాన్ని ప్రశ్నించింది. హ్యూమర్ పేరుతో ఒకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని తేల్చి చెప్పింది. రైనా తన ప్లాట్‌ఫామ్ ద్వారా వారి విజయాలను చూపిస్తూ షో చేయాలని సూచించింది.

ఈ కంటెంట్‌ను నియంత్రించడానికి ఒక ‘అటానమస్ బాడీ’ ఉండాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఇందులో న్యాయమూర్తులు, మీడియా నిపుణులు ఉండొచ్చని సూచించింది. ఏదైనా వీడియో చూసే ముందు కేవలం డిస్క్లైమర్ ఉంటే సరిపోదని, అవసరమైతే ఆధార్ కార్డు ద్వారా వయసు నిర్ధారణ చేసుకునే టెక్నాలజీ కూడా ఉండాలని అభిప్రాయపడింది.

మొత్తానికి, ఇంటర్నెట్‌లో ఫ్రీడమ్ పేరుతో చెలరేగిపోతున్న కంటెంట్ క్రియేటర్లకు సుప్రీంకోర్టు బ్రేకులు వేయబోతోంది. బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది. ఇకపై సోషల్ మీడియాలో వీడియో పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది.

This post was last modified on November 27, 2025 2:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

39 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

42 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

1 hour ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago