Political News

ఇక ఏపీ 26 కాదు 29 జిల్లాలు.. ఫైనల్ చేసిన సీఎం

ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నూతనంగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పడనుంది. ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. సచివాలయంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సీఎం చంద్రబాబు ఈ రోజు సమీక్షించారు. సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వి.అనిత, పి. నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు.

కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే కమిటీ అధ్యయనం చేసింది. కొత్తగా ఏర్పాటు అయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించారు. నంద్యాల జిల్లాలో బనగానపల్లె రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు. సత్య సాయి జిల్లాలో మడకశిర రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తారు. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేస్తారు. మూడు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించారు. 

అయితే వైసీపీ…ఇది రాజకీయంగా జరిగిన పునర్విభజన అంటూ విమర్శిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు జరిగిందని చెబుతోంది. అప్పట్లో 13 కొత్త జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెట్టామని వైసీపీ చెబుతోంది. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసినట్లు గుర్తు చేస్తోంది. శాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వక్రీకరణలు చేస్తున్నారని, ప్రసుత్తం స్వార్థం కోసం కొత్త జిల్లాలతో రాజకీయం చేస్తున్నారనేది వైసీపీ వాదన.

This post was last modified on November 25, 2025 5:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

16 minutes ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

2 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

2 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

7 hours ago