Political News

ఎంత బాగా చెప్పావు లోకేష్

“నేను కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నా. కానీ ఎక్కడా కుంగిపోలేదు. ధైర్యంగా నిలబడ్డాను. పోరాటం చేశాను. మనం కుంగిపోతే మనపై మరింత మంది రెచ్చిపోతారు. అప్పుడు మన ఉనికికే ప్రమాదం సంభవిస్తుంది.” అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన విలువల విద్య పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ ప్రవచణ కర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రచించిన ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే పంపిణీ చేయనున్నారు. ఈ పుస్తకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పరీక్షల్లో తప్పామన్న అవమానంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని కానీ ఇది సరికాదన్నారు. ఒక పరీక్ష తప్పితే మరోసారి రాసుకుని విజయం దక్కించుకోవచ్చని ఆత్మహత్య చేసుకుంటే మళ్లీ జీవితం తిరిగి రాదని అన్నారు. తాను కూడా జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తొలిసారి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు తాను ఓడిపోయానని అలాగని రాజకీయాలకు దూరమయ్యానా అని ప్రశ్నించారు. అంతేకాదు అదే నియోజకవర్గం నుంచి పట్టుబట్టి విజయం దక్కించుకున్నానన్నారు.

ఇక రాజకీయంగా కూడా తనకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయని చెప్పారు. అడుగడుగునా తాను అవమానాలు ఎదుర్కొన్నానన్నారు. బాడీ షేమింగ్ కూడా చేశారని తాను ఏం మాట్లాడినా తప్పుగా ప్రచారం చేశారని చెప్పారు. అయినా వాటిని తట్టుకుని నిలబడి ఇప్పుడు మంత్రిగా మీ ముందుకు వచ్చానని లోకేష్ చెప్పారు. అవమానాలు, వేధింపులు తట్టుకుని నిలబడినప్పుడే జీవితంలో పైకి వచ్చేందుకు అవకాశంగా మార్చుకున్నప్పుడే విజేతలు అవుతారని ఏ విజయమూ వడ్డించిన విస్తరి కాదని తెలిపారు. విద్యార్థులు కూడా ఒకసారి తప్పితేనో ఇంట్లో పరిస్థితులు సరిగా లేవనో ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు.

బలంగా నిలబడి ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఎదగాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరినీ గౌరవించాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో విద్యార్థులు మరింత గౌరవంగా ఉండాలన్నారు. ఇక ఉపాధ్యాయులు కూడా పిల్లలను తమ వారిగా భావించి తీర్చిదిద్దాలని మంత్రి లోకేష్ సూచించారు. వారి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించామన్నారు. ఇతర సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే వాటిని కూడా పరిష్కరించనున్నట్టు మంత్రి చెప్పారు.

This post was last modified on November 24, 2025 10:01 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

1 hour ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

5 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

9 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

9 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

10 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

11 hours ago