Political News

ఆ రెండు నియోజకవర్గాలపై టిడిపి డేగకన్ను.. రీజనేంటి..!

రెండు కీలకమైన ఎస్సీ నియోజకవర్గాల్లో టిడిపికి తీవ్ర ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పదేపదే ఆయా నియోజకవర్గాల నుంచి వివాదాలు విమర్శలు కూడా తెర మీదకు వస్తున్నాయి. దీంతో ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనేది పార్టీ అధిష్టానం తీవ్రంగా చర్చిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని సమూలంగా మార్చడంతో పాటు అవసరమైతే నాయకులను కూడా మార్చాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో టిడిపి అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి.

ఎమ్మెల్యేల వ్యవహారశైలి తీవ్ర వివాదంగా ఉన్న విషయం తెలిసిందే. సత్యవేడు నియోజకవర్గంలో వైసిపి నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు టికెట్ ఇవ్వడం ద్వారా గత ఎన్నికల్లో టిడిపి విజయం దక్కించుకుంది. అయితే ఈ ఆనందం అత్యంత వేగంగా ఆవిరైంది. మహిళా నాయకురాలిని వేధించారన్న కేసులో ఆదిమూలం చిక్కుకోవడం అనంతరం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. అయితే సదరు మహిళా నాయకురాలు మళ్లీ కేసును వెనక్కి తీసుకున్నప్పటికీ ఆదిమూలం మాత్రం యాక్టివ్ కాలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో టిడిపి మరో వ్యాపారవేత్తను రంగంలోకి దించింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిమూలం అలాగే వ్యాపారవేత్తకు మధ్య రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయి. తన అనుమతి లేనిదే నియోజకవర్గంలోకి ఎలా పర్యటిస్తారని తనకు చెప్పకుండా ఎలా వెళ్తారని ఆదిమూలం ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీ తనకు సంపూర్ణమైన హక్కులు కల్పించిందని అధికారం ఉందని వ్యాపారవేత్త చెబుతున్నారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో తరచుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీకి ఇబ్బందులు తెస్తూనే ఉన్నాయి.

ఇక తిరువూరు నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం అందరికీ తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద వ్యవహారశైలితో పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్నారన్నది వాస్తవం. ఇటీవల ఎంపీతో ఆయన భారీగానే రగడకు దిగారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేను మార్చాలన్నది స్థానికంగా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొలికపూడి కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని ఇటీవల లిఖితపూర్వకంగా సుమారు 12 మంది నాయకులు పార్టీకి సమాచారం అందించారు.

ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి మార్చే దిశగా నాయకులను సమన్వయం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. అవసరమైతే వచ్చే ఎన్నికల నాటికి మార్పులు చేయాలని కూడా నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

This post was last modified on January 6, 2026 10:23 am

Share

Recent Posts

వైసీపీని భయపెడుతున్న సర్వే

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…

2 hours ago

కింగ్ 100… కొత్తగా కనిపిస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…

3 hours ago

నయనతార నిర్ణయాలు అందుకే కరెక్ట్

టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…

3 hours ago

ఏష నాగుల కట్ట… కలెక్షన్లు తెచ్చే మూట

ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…

4 hours ago

భూమా.. బంగార‌మా… ఎక‌రం 269 కోట్ల రూపాయలా!

బంగారంతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్క‌డో కాదు. తెలంగాణ‌లోనే !. రాష్ట్ర పారిశ్రామిక‌,…

5 hours ago

మజ్లిస్ నుంచి ఎమ్మెల్సీ సస్పెండ్, కారణం అదేనా?

హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది.…

6 hours ago