Political News

ఆ రెండు నియోజకవర్గాలపై టిడిపి డేగకన్ను.. రీజనేంటి..!

రెండు కీలకమైన ఎస్సీ నియోజకవర్గాల్లో టిడిపికి తీవ్ర ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పదేపదే ఆయా నియోజకవర్గాల నుంచి వివాదాలు విమర్శలు కూడా తెర మీదకు వస్తున్నాయి. దీంతో ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనేది పార్టీ అధిష్టానం తీవ్రంగా చర్చిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని సమూలంగా మార్చడంతో పాటు అవసరమైతే నాయకులను కూడా మార్చాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో టిడిపి అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి.

ఎమ్మెల్యేల వ్యవహారశైలి తీవ్ర వివాదంగా ఉన్న విషయం తెలిసిందే. సత్యవేడు నియోజకవర్గంలో వైసిపి నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు టికెట్ ఇవ్వడం ద్వారా గత ఎన్నికల్లో టిడిపి విజయం దక్కించుకుంది. అయితే ఈ ఆనందం అత్యంత వేగంగా ఆవిరైంది. మహిళా నాయకురాలిని వేధించారన్న కేసులో ఆదిమూలం చిక్కుకోవడం అనంతరం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. అయితే సదరు మహిళా నాయకురాలు మళ్లీ కేసును వెనక్కి తీసుకున్నప్పటికీ ఆదిమూలం మాత్రం యాక్టివ్ కాలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో టిడిపి మరో వ్యాపారవేత్తను రంగంలోకి దించింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిమూలం అలాగే వ్యాపారవేత్తకు మధ్య రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయి. తన అనుమతి లేనిదే నియోజకవర్గంలోకి ఎలా పర్యటిస్తారని తనకు చెప్పకుండా ఎలా వెళ్తారని ఆదిమూలం ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీ తనకు సంపూర్ణమైన హక్కులు కల్పించిందని అధికారం ఉందని వ్యాపారవేత్త చెబుతున్నారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో తరచుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీకి ఇబ్బందులు తెస్తూనే ఉన్నాయి.

ఇక తిరువూరు నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం అందరికీ తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద వ్యవహారశైలితో పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్నారన్నది వాస్తవం. ఇటీవల ఎంపీతో ఆయన భారీగానే రగడకు దిగారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేను మార్చాలన్నది స్థానికంగా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొలికపూడి కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని ఇటీవల లిఖితపూర్వకంగా సుమారు 12 మంది నాయకులు పార్టీకి సమాచారం అందించారు.

ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి మార్చే దిశగా నాయకులను సమన్వయం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. అవసరమైతే వచ్చే ఎన్నికల నాటికి మార్పులు చేయాలని కూడా నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

Satya

Recent Posts

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

59 minutes ago

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

3 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

5 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

6 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

7 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

8 hours ago