అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద నేడు రైతుల ఖాతాల్లో నిధులు ప్రభుత్వం జమచేసింది. 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును జమ చేసింది. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు అందించింది. రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఆ వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కుంజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.2342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.792.09 కోట్లు రైతులకు అందిస్తున్నారు. పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో ఆగస్టు నెలలో నెలలో రూ.3174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ రోజు కమలాపురంలో పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో సిఎం చంద్రబాబు పాల్గొంటారు. పుట్టపర్తి పర్యటన అనంతరం మధ్యాహ్నం కమలాపురం వెళ్లి అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి హాజరవుతారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు, కేంద్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. 10 వేల పైచిలుకు రైతు సేవా కేంద్రాల్లో నిధుల విడుదల కార్యక్రమాన్ని లైవ్ టెలి కాస్ట్ చేసేలా చర్యలు చేపట్టారు. రైతుల ఖాతాల్లో నిధుల విడుదల మాత్రమే కాకుండా…వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని సిఎం సూచన చేశారు.
అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం పెంపు, పకృతి సేధ్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ధర వచ్చేలా చేయడం వంటి అంశాలపై రైతాంగానికి అవగాహన కలిగించేలా కార్యక్రమం నిర్వహించనున్నారు.
This post was last modified on November 19, 2025 11:16 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…