బీహార్ రాజకీయాల్లో “నితీష్ కుమార్” అంటేనే ఒక రికార్డు. ముఖ్యమంత్రి కుర్చీ మారదు, కూటములు మాత్రమే మారుతుంటాయి అనే పేరున్న ఆయన, ఇప్పుడు మరో చరిత్ర సృష్టించబోతున్నారు. అక్షరాలా 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయ్యారు. ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, ఈరోజు (బుధవారం) ఆయన తన పదవికి రాజీనామా చేసి, మళ్లీ రేపు (గురువారం) కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం.
ఈసారి ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకి పండగలాంటివే. మొత్తం 243 సీట్లలో ఏకంగా 202 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కూటమిలో నితీష్ పార్టీ (JDU) కంటే బీజేపీనే ‘పెద్దన్న’గా అవతరించింది. బీజేపీకి 89 సీట్లు వస్తే, జేడీయూ 85 సీట్లకే పరిమితమైంది. ఇక చిరాగ్ పాశ్వాన్ పార్టీ 19 సీట్లతో తన సత్తా చాటగా, మాంఝీ, కుష్వాహ పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. సంఖ్యాబలం బీజేపీకి ఎక్కువ ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం నితీషే మళ్లీ కింగ్ కాబోతున్నారు.
పైకి అంతా బాగున్నట్టే కనిపిస్తున్నా, తెర వెనుక మాత్రం పదవుల పంపకంపై గట్టి యుద్ధమే నడుస్తోంది. ముఖ్యంగా ‘హోం శాఖ’ ఎవరికి అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎప్పటి నుంచో ఈ శాఖను తన దగ్గరే పెట్టుకుంటున్న నితీష్, ఈసారి కూడా వదులుకోవడానికి రెడీగా లేరు. కానీ, ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ మాత్రం ఈసారి కీలక శాఖలతో పాటు, ‘స్పీకర్’ పదవి కూడా తమకే కావాలని పట్టుబడుతోంది. ప్రమాణ స్వీకారానికి ఒక్క రోజు ముందే ఈ బేరసారాలు తారాస్థాయికి చేరాయి.
ఈ రాజకీయ చదరంగం ఎలా ఉన్నా, వేడుక మాత్రం గ్రాండ్గా ప్లాన్ చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్ ఇందుకు వేదిక కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ విజయాన్ని దేశవ్యాప్తంగా ఒక పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్గా చూపించాలని ఎన్డీయే భావిస్తోంది. రేపు ఉదయం జరిగే ఈ వేడుక కోసం భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.
ఈరోజు ఎన్డీయే ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ సెంట్రల్ హాల్లో సమావేశమై నితీష్ను తమ నాయకుడిగా అధికారికంగా ఎన్నుకుంటారు. ఆ వెంటనే గవర్నర్ను కలిసి పాత ప్రభుత్వానికి రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు క్లెయిమ్ చేస్తారు. కొత్త కేబినెట్లో బీజేపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి బీహార్లో మళ్లీ నితీష్ మార్క్ రాజకీయం మొదలైందన్నమాట.
This post was last modified on November 19, 2025 12:18 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…