Political News

రాహుల్ రాజ‌కీయం.. పుట్టిముంచుతోందా?

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, లోక్ స‌భలో విపక్ష నేత రాహుల్ గాంధీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది, తాజాగా వచ్చిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ వ్యవహారం చేర్చ‌నీయాంశంగా మారింది. గతంలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆయన గెలుపు గుర్రం ఎక్కుతామని కేంద్రంలో అధికారంలోకి వస్తామని ప్రకటించారు.

కానీ మోడీ ప్ర‌భావం ముందు నిలవలేకపోయారు. అంతేకాదు 2014లో దక్కించుకున్న పార్లమెంటు స్థానాల కంటే కూడా 2019లో మరింత దిగజారే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటక కు చెందిన మల్లికార్జున ఖ‌ర్గే పార్టీ అధ్యక్షుడు స్థానాన్ని స్వీకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగాలన్నా రాహుల్ గాంధీ ఆమోదముద్ర ప‌డితే తప్ప జరగడం లేదన్న వాదన వినిపిస్తోంది.

నిజానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ రాహుల్ గాంధీ ఆమోదం లేకుండా ఏ చిన్న పనినీ చేయలేని పరిస్థితి ఉందన్నది వాస్తవం. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటే హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముందు దీనిని కొనసాగించే సమయంలో కూడా రాహుల్ గాంధీ ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగతంగా నాయకులు నియమించాల్సి వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ అనుమతి అవసరమని బహిరంగంగానే ప్రకటనలు చేశారు.

ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా కూడా రాహుల్ గాంధీ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. అంటే ప్రత్యక్షంగా అధ్యక్ష హోదాలో లేకపోయినప్పటికీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తాజా ఎన్నికల్లో బీహార్ లో మరింత దిగజారిపోవడం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీవ్ర స్థాయిలో ఇరుకున‌ పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజకీయాలు సొంత పార్టీలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ఇబ్బందికి కూడా గురవుతున్నాయి.

ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీని సరైన దారిలో నడిపించలేకపోతున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాల అంచనా. కేరళకు చెందిన శశిధరూర్ తమిళనాడుకు చెందిన చిదంబరం వంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యే అవకాశం ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత దెబ్బతింటుంది.

మరి ముఖ్యంగా ఇండియా కూటమిలో పార్టీలు ఇప్పటికే చీలికలు పేలికలుగా మారాయి. భవిష్యత్తులో ఆయా పార్టీలు మరింత దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా రాహుల్ గాంధీ రాజకీయానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందన్నది స్పష్టం అవుతున్న పరిణామం.

This post was last modified on November 17, 2025 6:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago