Political News

రాహుల్ రాజ‌కీయం.. పుట్టిముంచుతోందా?

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, లోక్ స‌భలో విపక్ష నేత రాహుల్ గాంధీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది, తాజాగా వచ్చిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ వ్యవహారం చేర్చ‌నీయాంశంగా మారింది. గతంలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆయన గెలుపు గుర్రం ఎక్కుతామని కేంద్రంలో అధికారంలోకి వస్తామని ప్రకటించారు.

కానీ మోడీ ప్ర‌భావం ముందు నిలవలేకపోయారు. అంతేకాదు 2014లో దక్కించుకున్న పార్లమెంటు స్థానాల కంటే కూడా 2019లో మరింత దిగజారే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటక కు చెందిన మల్లికార్జున ఖ‌ర్గే పార్టీ అధ్యక్షుడు స్థానాన్ని స్వీకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగాలన్నా రాహుల్ గాంధీ ఆమోదముద్ర ప‌డితే తప్ప జరగడం లేదన్న వాదన వినిపిస్తోంది.

నిజానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ రాహుల్ గాంధీ ఆమోదం లేకుండా ఏ చిన్న పనినీ చేయలేని పరిస్థితి ఉందన్నది వాస్తవం. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటే హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముందు దీనిని కొనసాగించే సమయంలో కూడా రాహుల్ గాంధీ ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగతంగా నాయకులు నియమించాల్సి వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ అనుమతి అవసరమని బహిరంగంగానే ప్రకటనలు చేశారు.

ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా కూడా రాహుల్ గాంధీ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. అంటే ప్రత్యక్షంగా అధ్యక్ష హోదాలో లేకపోయినప్పటికీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తాజా ఎన్నికల్లో బీహార్ లో మరింత దిగజారిపోవడం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీవ్ర స్థాయిలో ఇరుకున‌ పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజకీయాలు సొంత పార్టీలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ఇబ్బందికి కూడా గురవుతున్నాయి.

ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీని సరైన దారిలో నడిపించలేకపోతున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాల అంచనా. కేరళకు చెందిన శశిధరూర్ తమిళనాడుకు చెందిన చిదంబరం వంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యే అవకాశం ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత దెబ్బతింటుంది.

మరి ముఖ్యంగా ఇండియా కూటమిలో పార్టీలు ఇప్పటికే చీలికలు పేలికలుగా మారాయి. భవిష్యత్తులో ఆయా పార్టీలు మరింత దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా రాహుల్ గాంధీ రాజకీయానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందన్నది స్పష్టం అవుతున్న పరిణామం.

This post was last modified on November 17, 2025 6:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

8 minutes ago

వారణాసి హీరోయిన్ విదేశీ రహస్యం

ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…

17 minutes ago

నాగచైతన్య.. అరాచకమైన మేకోవర్..

నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్‌లో, లవర్ బాయ్‌గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…

38 minutes ago

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…

2 hours ago

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

3 hours ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

7 hours ago