Political News

రాజ్యాంగం వల్లే ప్రధానిగా ఛాయ్ వాలా!

భారత రాజ్యాంగం ఎంతో గొప్పది… బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన ఈ అత్యున్నత రాజ్యాంగం వల్ల ఛాయ్ వాలా దేశానికి ప్రధాని కాగలిగారు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హాజయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు భారత దేశ దిశనే మార్చేశాయన్నారు. ఈ 75 ఏళ్ల మైలురాయి సందర్భంగా బీఆర్ అంబేడ్కర్ రూపకల్పనకు భారతీయులందరూ కృతజ్ఞులమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పురోగతికి కారణం మన పటిష్టమైన రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థేనని ఆయన అభిప్రాయపడ్డారు.

2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు నాలుగో ఆర్థిక వ్యవస్థకు చేరామని తెలిపారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత సోషల్ మీడియా గురించి కూడా ఆయన మాట్లాడారు. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయన్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే.. ప్రతి ఒక్కరూ ఎడిటరే అని అన్నారు. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరం అని చంద్రబాబు అన్నారు.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

17 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

49 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago