Political News

నెటిజ‌న్ల కామెంట్‌: ఇప్పుడు ఎన్ని చెబితే ఏంటి ‘పీకే’ స‌ర్‌!

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. జ‌న్ సురాజ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ పీకే.. బీహార్ లో జ‌రిగిన తాజా అసెంబ్లీ ఎన్ని క‌ల్లో చావు దెబ్బ‌తిన్నారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న క‌నీసం 230 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిలబెట్టినా.. ఒక్క‌రు కూడా డిపాజిట్ ద‌క్కించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌ని దారుణ స్థితికి చేరుకున్నారు.దీంతో పీకేకు ఉన్న ఇమేజ్ దాదాపు త‌గ్గిపోయింద‌న్న కామెట్లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు.. ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోవ‌ర్లు కూడా త‌గ్గు ముఖం ప‌ట్టారు.

ఇదిలావుంటే.. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన పీకే.. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన తీరుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా ఎన్డీయే కూట‌మి విజ‌యంపై ఆయ‌న కామెంట్లు కుమ్మ‌రించారు. దేశ ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌యోజ‌నాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌పంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చింద‌న్నారు. ఇది స‌హ‌జ‌మే. అయితే.. ఇలా తెచ్చిన సొమ్ములో 14 వేల కోట్ల రూపాయ‌ల‌ను బీహార్ ఎన్నిక‌ల‌కు ఖ‌ర్చు చేశార‌ని చెప్పారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న ఓ కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు.

“మీకు గుర్తుండే ఉంటుంది.. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందు.. రెండు మూడు రోజుల్లో ఎన్నిక‌ల కోడ్ వ‌స్తుంద‌నగా.. రాష్ట్రంలో ప్ర‌తి మ‌హిళ‌కు నితీష్ ప్ర‌భుత్వం 10 వేల రూపాయ‌లు బ్యాంకుల్లో వేసింది. ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఎలా వ‌చ్చిందో లెక్కలు చెప్ప‌లేదు. దీనికి నెల ముందు.. రాష్ట్రంలో ఉద్యోగులు జీతాలు పెంచ‌మ‌ని డిమాండ్ చేశారు. ఆ స‌మ‌యంలో సీఎం నితీష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌జానా ఖాళీ అయింద‌న్నారు. మ‌రి అలాంట‌ప్పుడు మ‌హిళ‌ల‌కు ఇచ్చేందుకు అన్ని వేల కోట్లు ఎక్కడ నుంచి వ‌చ్చాయి?. అంటే ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చిన సొమ్మును కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. అది ఎన్నికల కోస‌మే ఇచ్చింది.” అని పీకే ఆరోపించారు.

తాజా ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్యయుతంగా జ‌ర‌గ‌లేద‌న్న పీకే.. ఇవి పూర్తిగా ఓటు కొనుగోలు చేయ‌డం ద్వారా మాత్ర‌మే జ‌రిగిన ఎన్నిక‌లుగా గుర్తించామ‌న్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే.. పీకే చేసిన వ్యాఖ్య‌ల‌పైనెటిజ‌న్లు పెద‌వి విరుస్తున్నారు. ఇవ‌న్నీ ఇప్పుడు ఎవ‌రు న‌మ్ముతారు? అని కొంద‌రు కామెంట్లు చేస్తే.. మ‌రికొంద‌రు “మీరు ఓ 50 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని ఉంటే ఇలానే చెప్పేవారా?” అని ప్ర‌శ్నించారు. కాగా.. ఈ ఎన్నిక‌ల్లో పీకే పార్టీ 3.3 శాతం ఓట్లు ద‌క్కించుకుంద‌ని ఎన్నిక‌ల సంఘం డేటా వెల్ల‌డించింది.

Satya

Recent Posts

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

2 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

4 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

5 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

6 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

6 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

7 hours ago