ఏపీ సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ నిజంగా ప్రత్యేకం. ఏపీ పునర్నిర్మాణానికి తాను కట్టుబడి ఉన్నానని సీఎం పలుసార్లు చెప్పారు. పరిపాలనలో ఆయన వేసే ప్రతి అడుగులో ఈ స్పష్టత కనిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక స్పష్టమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి, దాన్ని అమలు చేయడానికి ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం, తిరుపతి నగరాల అభివృద్ధికి కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతోంది.
గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల సిద్ధాంతం పూర్తిగా ఫ్లాప్ అయిందని ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా చెబుతోంది. అమరావతిపై అక్కసుతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశంపార్టీ ఆరోపించింది. ఇదే సమయంలో ఒకటే రాజధాని అది అమరావతి అన్న విషయాన్ని స్పష్టంగా తెలిపింది. అభివృద్ధి అనేది వికేంద్రీకరణతో రావాలని కూడా ప్రకటించింది. ఈ దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇక అభివృద్ధి ఒక్క అమరావతిలోనే కాకుండా విశాఖ, తిరుపతి నగరాల్లో కూడా ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాలను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. నగరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యలతో పౌరులకు మెరుగైన వసతులు, పచ్చదనం, ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చే అవకాశం ఉండటంతో మరిన్ని పరిశ్రమలు కూడా రావచ్చని అంచనా. కొత్త కంపెనీలకు అవసరమైన భూసముపార్జన, అనుకూల వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. విశాఖను ప్రముఖ పెట్టుబడి కేంద్రంగా మార్చడం లక్ష్యం.
అమరావతి, తిరుపతి, విశాఖ పట్నాల్లో హాస్పిటాలిటీ రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ హోటల్ యూనిట్లను స్థాపించేందుకు ప్రోత్సాహాలు ఇవ్వనుంది. ఈ మూడు ఆర్థిక కారిడార్ల అభివృద్ధి పర్యవేక్షణ కోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించనున్నట్లు వెల్లడించింది.
పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా బీచ్ టూరిజానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విధంగా ఏపీ లోని మూడు ప్రధాన నగరాలను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని కొత్త దారిలో నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.
This post was last modified on November 16, 2025 11:20 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితీ అంత బాగా లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. జనాలు థియేటర్లకు…