ఏపీ సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ నిజంగా ప్రత్యేకం. ఏపీ పునర్నిర్మాణానికి తాను కట్టుబడి ఉన్నానని సీఎం పలుసార్లు చెప్పారు. పరిపాలనలో ఆయన వేసే ప్రతి అడుగులో ఈ స్పష్టత కనిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక స్పష్టమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి, దాన్ని అమలు చేయడానికి ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం, తిరుపతి నగరాల అభివృద్ధికి కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతోంది.
గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల సిద్ధాంతం పూర్తిగా ఫ్లాప్ అయిందని ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా చెబుతోంది. అమరావతిపై అక్కసుతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశంపార్టీ ఆరోపించింది. ఇదే సమయంలో ఒకటే రాజధాని అది అమరావతి అన్న విషయాన్ని స్పష్టంగా తెలిపింది. అభివృద్ధి అనేది వికేంద్రీకరణతో రావాలని కూడా ప్రకటించింది. ఈ దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇక అభివృద్ధి ఒక్క అమరావతిలోనే కాకుండా విశాఖ, తిరుపతి నగరాల్లో కూడా ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాలను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. నగరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యలతో పౌరులకు మెరుగైన వసతులు, పచ్చదనం, ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చే అవకాశం ఉండటంతో మరిన్ని పరిశ్రమలు కూడా రావచ్చని అంచనా. కొత్త కంపెనీలకు అవసరమైన భూసముపార్జన, అనుకూల వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. విశాఖను ప్రముఖ పెట్టుబడి కేంద్రంగా మార్చడం లక్ష్యం.
అమరావతి, తిరుపతి, విశాఖ పట్నాల్లో హాస్పిటాలిటీ రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ హోటల్ యూనిట్లను స్థాపించేందుకు ప్రోత్సాహాలు ఇవ్వనుంది. ఈ మూడు ఆర్థిక కారిడార్ల అభివృద్ధి పర్యవేక్షణ కోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించనున్నట్లు వెల్లడించింది.
పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా బీచ్ టూరిజానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విధంగా ఏపీ లోని మూడు ప్రధాన నగరాలను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని కొత్త దారిలో నడపాలని ప్రభుత్వం భావిస్తోంది.
This post was last modified on November 16, 2025 11:20 am
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…