ప్రస్తుతం దేశవ్యాప్తంగా గూగుల్ను కుదిపేస్తున్న అంశం.. ‘మదర్ ఆఫ్ సైతాన్’. ఏంటిది? ఎందుకు? ఎలా ఆవిర్భవించింది? దీనివెనుక ఎవరు ఉన్నారు? ఇలా.. అనేక అంశాలను నెటిజన్లు తెగవెతికేస్తున్నారు. దీనికి కారణం.. దేశంలో గత నాలుగు రోజులుగా తీవ్ర చర్చకు.. భయానికి కూడా దారి తీసిన ఎర్ర కోట కారు పేలుడు ఘటనే. ఈ ఘటన జరిగి దాదాపు ఐదు రోజులు అయింది. అయినా.. దాని తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
దీనికి కూడా కారణం ఉంది. ఈ ఘటనకు సూత్ర ధారులు.. ఎవరైనా పాత్ర ధారులు మాత్రం అత్యున్నత వైద్య విద్యను చదువుకున్నవారే కావడం కారణం. అంతేకాదు.. ఈ దాడులకు మందుగుండు సామాగ్రిని తయారు చేసిన వైద్యులు.. అత్యంత ప్రతిభావంతులని అధికారులు గుర్తించారు. ప్రొఫెసర్లుగా, డీన్లు గా వారు వైద్య వృత్తిలో ఉన్నారు. అలాంటి వారు దేశానికి హాని తలపెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ పేరే.. ‘మదర్ ఆఫ్ సైతాన్’.
భారత దేశాన్ని వీరు సైతాన్తో పోల్చారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో పలు చోట్ల విద్వంసాలు సృష్టించేందుకు అనేక ప్రయోగాలు చేశారు. కీలక రసాయనాన్ని రూపొందించారు. దీనిని మదర్ ఆఫ్ సైతాన్గా పిలుస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. దీనిని బహిరంగ ప్రదేశాలు.. ఆలయాలు, ఇతర హిందూ సామాజిక వర్గం చేరుచుకునే ప్రాంతాల్లోని తాగు నీటిలో కలపడం ద్వారా సామూహిక హననాలకు పక్కా ప్రణాళిక రచించారు.
అదేవిధంగా దీనిని పేలుడు పదార్థంగా కూడా వినియోగించుకోవచ్చు. పేరెన్నికగన్న వైద్యులు, ప్రస్తుతం ఉగ్రముఠాతో చేతులు కలిపినవారు.. తమకు ఉన్న జ్ఞానంతో ‘మదర్ ఆఫ్ సైతాన్’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని వాడేందుకు సిద్ధం చేశారు. వాస్తవానికి ‘ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ ‘ అనే రసాయనం అత్యంత ప్రమాదకరం. దీనికి రసాయన భాషలో ఎలాంటి పేరు ఉన్నా.. దీనిని మదర్ఆఫ్ సైతాన్గా భావిస్తారు. డాక్టర్ల బృందం ఈ రసాయనాన్ని అమ్మోనియం నైట్రైట్తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేసింది. దీనిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
This post was last modified on November 16, 2025 4:14 pm
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…