త్వరలో వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. విజయవాడలో తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. వంగవీటి రాధా రంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని అన్నారు. పదేళ్ల నుంచి తాను పబ్లిక్ లైఫ్ నుంచి దూరంగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడు క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
రాధా రంగా మిత్రమండలి సభ్యులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. తాను ఏ పార్టీలో చేరతాను అనేది రాధా రంగా మిత్రమండలి పెద్దలతో కలిసి భవిష్యత్తులో నిర్ణయిస్తానని అన్నారు. తనకు అన్న రాధాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. ఆయన మద్దతు తనకు ఉంటుందని నమ్ముతున్నానని తెలిపారు. రాజకీయంగా ఆయన నిర్ణయాలు ఆయనవి, తన నిర్ణయాలు తనవి అన్నారు.
ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా పేరు తెలియని వారు ఉండరు. 80వ దశకంలో ఆయన కాపు సామాజిక వర్గ నేతగా, బెజవాడ ప్రాంతంలో బలమైన రాజకీయనేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1985లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1988 లో ఆయన హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ ఘటన సంచలనం రేకెత్తించింది. ఆయన కుమారుడు వంగవీటి రాధా ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆయన అంత యాక్టివ్ గా లేరు.
రంగా కుమార్తె ఆశకిరణ్ 20 ఏళ్ల కిందట తన తల్లికి బాసటగా ఆమె రాజకీయాల్లో ప్రచారం చేశారు. అనంతరం ఇప్పుడే బయటికి వచ్చారు. ఆమె వైసీపీలో చేరుతారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…