Political News

రాజకీయాల్లోకి రంగా కుమార్తె!

త్వరలో వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. విజయవాడలో తండ్రి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. వంగవీటి రాధా రంగా మిత్రమండలి మధ్య గ్యాప్ ఉందని అన్నారు. పదేళ్ల నుంచి తాను పబ్లిక్ లైఫ్ నుంచి దూరంగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడు క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.

రాధా రంగా మిత్రమండలి సభ్యులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. తాను ఏ పార్టీలో చేరతాను అనేది రాధా రంగా మిత్రమండలి పెద్దలతో కలిసి భవిష్యత్తులో నిర్ణయిస్తానని అన్నారు. తనకు అన్న రాధాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. ఆయన మద్దతు తనకు ఉంటుందని నమ్ముతున్నానని తెలిపారు. రాజకీయంగా ఆయన నిర్ణయాలు ఆయనవి, తన నిర్ణయాలు తనవి అన్నారు.

ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా పేరు తెలియని వారు ఉండరు. 80వ దశకంలో ఆయన కాపు సామాజిక వర్గ నేతగా, బెజవాడ ప్రాంతంలో బలమైన రాజకీయనేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1985లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1988 లో ఆయన హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ ఘటన సంచలనం రేకెత్తించింది. ఆయన కుమారుడు వంగవీటి రాధా ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆయన అంత యాక్టివ్ గా లేరు.

రంగా కుమార్తె ఆశకిరణ్ 20 ఏళ్ల కిందట తన తల్లికి బాసటగా ఆమె రాజకీయాల్లో ప్రచారం చేశారు. అనంతరం ఇప్పుడే బయటికి వచ్చారు. ఆమె వైసీపీలో చేరుతారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

This post was last modified on November 16, 2025 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

5 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

41 minutes ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

6 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

6 hours ago