Political News

అంత బీజీలోనూ ప్రజాదర్బార్ కొనసాగించుతున్న మంత్రి లోకేష్

ప్రజల సమస్యలు వినడం మరియు పరిష్కార మార్గం చూపడంలో మంత్రి నారా లోకేష్ చొరవ చూపుతున్నారు. తాడేపల్లిలోనే కాదు ఎక్కడ ఉన్నా స్థానిక పార్టీ కార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించడం ఆయన పద్ధతిగా మారింది. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ 73వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.

విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో నిన్నంతా లోకేష్ బిజీగానే ఉన్నారు. సదస్సు తొలి రోజున విద్య మరియు ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రఖ్యాత కంపెనీలతో ఏపీ ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

రాత్రిపూట సదస్సుతో బిజీగా గడిపిన మంత్రి లోకేష్ ఈ రోజు ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి వినతులను స్వీకరించారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఇది ఆయన నిర్వహించిన డెబ్బై రెండవ ప్రజాదర్బార్. ఈ వినూత్న కార్యక్రమం ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఎక్కడ ప్రజాదర్బార్ జరిగినా జనం పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఇందుకు నిదర్శనం. ఒక ట్వీట్ చేస్తే కూడా లోకేష్ వెంటనే స్పందిస్తారనే నమ్మకం ప్రజల్లో పెరిగింది.

ఈ రోజు ప్రజాదర్బార్ లో పలువురు తమ సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చిననడిపిల్లి గ్రామానికి చెందిన బంగారి శ్రీనివాసరావు తమ 5.64 ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేయాలని కోరారు.

జీవీఎంసీలో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని మరియు తమకు అండగా నిలవాలని నీ తోడు సొసైటీ ఫర్ ట్రాన్స్ జండర్ పర్సన్స్ ప్రతినిధులు మంత్రి లోకేష్ ను కలిసి కోరారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సహాయం అందించాలని నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతానికి చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మర్రిపాలెకు చెందిన ఎన్ నరసింహస్వామి తమ 3.10 ఎకరాల వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో మంచాల నాగేశ్వరరావు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు.

ఈ అన్ని విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

This post was last modified on November 15, 2025 1:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

20 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

27 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

42 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

1 hour ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago