Political News

శ్రీవారి పరకామణి కేసులో సంచలనం: ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో జరిగిన దొంగతనాన్ని బయటకు తీసి ఫిర్యాదు చేసిన టీటీడీ ఉద్యోగి మరియు ఏవీ ఎస్ వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయనే ఈ కేసును వెలుగులోకి తెచ్చిన వ్యక్తి.

2021 22లో పరకామణిని లెక్కించే సమయంలో విదేశీ డాలర్లను దొంగిలిస్తున్న సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌ను సతీష్ గుర్తించారు. వెంటనే ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ కేసు బయటపడిన తర్వాత లోక్ అదాలత్‌లో రాజీ కుదిరింది. ఈ క్రమంలో రవికుమార్ తన వద్ద ఉన్న వంద కోట్ల రూపాయల ఆస్తులను శ్రీవారికి ఇచ్చేశారు. అయితే ఇలాంటి రాజీ ఎందుకు కుదిరిందనే అంశంపై తిరుపతికి చెందిన జర్నలిస్టు శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. అప్పటి హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది.

అప్పటి ఈవోతో పాటు అప్పటి చైర్మన్ గా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డిని కూడా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో కీలక పాత్ర పోషించిన సతీష్ కుమార్ మృతదేహం అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ వద్ద కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పరకామణి కేసు కీలక దశలో ఉండగా సతీష్ అనుమానాస్పదంగా మరణించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. దీని వెనుక పరకామణి దొంగలే ఉండి ఉంటారన్న ఆరోపణలు బీజేపీ మరియు టీడీపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. కర్నూలుకు చెందిన సతీష్ టీటీడీ భద్రతా విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన మృతి కేసుపై మరింత అనుమానాలు పెంచుతోంది. వైఎస్ఆర్‌సీపీ నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలను టీడీపీ నాయకులు బలంగా చెబుతున్నారు.

This post was last modified on November 14, 2025 3:54 pm

Share
Show comments
Published by
Satya
Tags: TTD

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

8 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago