Political News

శ్రీవారి పరకామణి కేసులో సంచలనం: ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో జరిగిన దొంగతనాన్ని బయటకు తీసి ఫిర్యాదు చేసిన టీటీడీ ఉద్యోగి మరియు ఏవీ ఎస్ వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయనే ఈ కేసును వెలుగులోకి తెచ్చిన వ్యక్తి.

2021 22లో పరకామణిని లెక్కించే సమయంలో విదేశీ డాలర్లను దొంగిలిస్తున్న సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌ను సతీష్ గుర్తించారు. వెంటనే ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ కేసు బయటపడిన తర్వాత లోక్ అదాలత్‌లో రాజీ కుదిరింది. ఈ క్రమంలో రవికుమార్ తన వద్ద ఉన్న వంద కోట్ల రూపాయల ఆస్తులను శ్రీవారికి ఇచ్చేశారు. అయితే ఇలాంటి రాజీ ఎందుకు కుదిరిందనే అంశంపై తిరుపతికి చెందిన జర్నలిస్టు శ్రీనివాస్ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. అప్పటి హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది.

అప్పటి ఈవోతో పాటు అప్పటి చైర్మన్ గా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డిని కూడా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో కీలక పాత్ర పోషించిన సతీష్ కుమార్ మృతదేహం అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ వద్ద కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పరకామణి కేసు కీలక దశలో ఉండగా సతీష్ అనుమానాస్పదంగా మరణించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. దీని వెనుక పరకామణి దొంగలే ఉండి ఉంటారన్న ఆరోపణలు బీజేపీ మరియు టీడీపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. కర్నూలుకు చెందిన సతీష్ టీటీడీ భద్రతా విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన మృతి కేసుపై మరింత అనుమానాలు పెంచుతోంది. వైఎస్ఆర్‌సీపీ నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలను టీడీపీ నాయకులు బలంగా చెబుతున్నారు.

This post was last modified on November 14, 2025 3:54 pm

Share
Show comments
Published by
Satya
Tags: TTD

Recent Posts

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

37 minutes ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

1 hour ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

2 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

3 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

3 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

3 hours ago