Political News

సునీతకు బిగ్ రిలీఫ్‌.. కూటమికి థ్యాంక్స్‌..!

వైసీపీ అధినేత జగన్‌కు సోదరి, 2019లో దారుణ హత్యకు గురైన వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతకు బిగ్ రిలీఫ్ దక్కింది. తన తండ్రి దారుణ హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న సునీత అనేక మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో బాధితులుగా ఉన్న సునీతపైనే వైసీపీ హయాంలో కేసులు నమోదయ్యాయి. కారణాలు ఏవైనా, అప్పటి పోలీసులు ఆమెపైనే కేసు పెట్టారు.

సునీత సహా ఆమె భర్త రాజశేఖరరెడ్డిపై అప్పటి కడప పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు ఏఎస్‌ఐ, మరొకరు ఏఎస్పీ. అయితే ఈ కేసులను తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఇది ఒకరకంగా సునీతకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఇప్పుడు దీనికి మించిన రిలీఫ్ ఇస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పట్లో సునీత దంపతులపై కేసులు నమోదు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

అంటే అప్పట్లో సునీత, ఆమె భర్తపై కేసులు పెట్టిన ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ రాజేశ్వర్‌రెడ్డిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ ఇద్దరూ గత ఏడాదే రిటైరయ్యారు. అయినప్పటికీ వారిపై శాఖాపరమైన దర్యాప్తు చేయించడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంతేకాదు అసలు ఈ కేసులు నమోదు చేయాలని తెర వెనుక నుంచి ఎవరు ప్రోత్సహించారన్న విషయంపైనా కూపీ లాగనుంది.

మరోవైపు సునీతపై తప్పుడు కేసులు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లింగాలకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఇది మరింతగా సదరు రిటైర్డ్ అధికారుల మెడకు చుట్టుకోనుంది. ఈ ఫిర్యాదుతో కొత్తగా కేసు నమోదు చేయనున్నారు. ఒకప్పుడు ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసిన అధికారులే ఇప్పుడు నిందితులుగా మారనుండటం విశేషం.

మొత్తంగా వివేకా కేసులో ఇన్నేళ్ల తర్వాత సునీతకు కొంతలో కొంత బిగ్ రిలీఫ్ దక్కినట్టయింది.

This post was last modified on November 10, 2025 12:33 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

41 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

57 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago