Political News

ఎమ్మెల్యేల విషయంలో బాబు కన్నా లోకేష్ సీరియస్

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకు మారుపేరు అన్న సంగతి తెలిసిందే. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా తప్పులు చేసినా.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినా.. ఆయన ఊరుకోరు. ఈ విషయంలో పార్టీ కార్యక్రమాల్లో, మీడియా ముందు కూడా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. హెచ్చరికలూ జారీ చేస్తుంటారు బాబు. ఐతే బాబుతో పోలిస్తే నారా లోకేష్ కొంచెం మెతక అనే అభిప్రాయం ఉంది.

కానీ అవసరమైనపుడు నారా లోకేష్ కొరడా ఝళిపించడానికి వెనుకాడరు. తాజాగా ఆయన పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలు ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి, దురుసు ప్రవర్తన, ఇతర అవలక్షణాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ స్పందించారు.

తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొందరు నేతలకు మంచి చెడులు తెలియడం లేదని నారా లోకేష్ అన్నారు. అవగాహన రాహిత్యం, అనుభవ లేమి వల్ల వారిలో సమన్వయం ఉండట్లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ నేతలు.. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. సమస్యలను ఎలా అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలపై కొత్త ఎమ్మెల్యేలకు అవగాహణ కల్పించాలని ఆయన కోరారు. కొత్త ఎమ్మెల్యేలు మళ్లీ గెలవాలంటే లోటు పాట్లు సరి చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు లోకేష్ అంచనా వేశారు.

This post was last modified on November 10, 2025 2:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

1 hour ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

1 hour ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

1 hour ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago