Movie News

సాహితీ వనంలో విప్లవ కుసుమం ‘అందెశ్రీ’

ప్రముఖ విప్లవ రచయిత అందెశ్రీ ఇవాళ కన్నుమూయడం సాహితీవేత్తలను, పరిశ్రమ వర్గాలను, ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉదయం గుండెపోటు రాగానే ఇంట్లో వాళ్ళు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. సినిమాల పరంగా అందెశ్రీ చేసిన సేవలు, రాసిన సాహిత్యం చాలా గొప్పది. ముఖ్యంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కలయికలో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఎర్ర సముద్రంలో ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు’ విపరీత ఆదరణకు నోచుకుంది. పలు ఏపీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు సబ్జెక్టులో ఈ పాటను ఒక పాఠంగా పెట్టడం అందెశ్రీ ఘనతకు సాక్ష్యం.

సింధు తులాని నటించిన బతుకమ్మలో సినుకమ్మా వాన సినుకమ్మా, రండి కదలి రండి పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఆ చిత్రానికి అందెశ్రీ మాటలు కూడా రాశారు. జగపతిబాబు జై బోలో తెలంగాణలో ‘జన జాతరలో మన గీతం’ క్లాసు మాస్ లేకుండా అందరినీ ఆకట్టుకున్న గీతంగా నిలిచింది. 2006లో విడుదలైన గంగ సినిమాకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. ఇక అందెశ్రీ జీవిత విశేషాలు చూస్తే సిద్ధిపేట జిల్లా రేబర్తి ఆయన స్వగ్రామం. 1961 జూలై 31 జన్మించారు. పాఠశాల చదువు పెద్దగా లేకపోయినా కవిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

దాశరథి సాహితి పురస్కారం (2015), జానకమ్మ జాతీయ అవార్డు (2022), దాశరధి కృష్ణమాచార్య సాహితి పురస్కారం (2024) తో పాటు ఎన్నో అవార్డులు ఆయన కీర్తి కిరీటంలో చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మక రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ రాసే భాగ్యాన్ని అందెశ్రీనే అందుకున్నారు. అందుకే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. రచనలు మొదలుపెట్టాక కలం పేరే అసలు పేరుగా మారిపోయింది. సాహితిలోకాన్ని శోకంల్లో ముంచుతూ అందెశ్రీ సెలవు తీసుకున్నా ఆయన సాహిత్యం చిరకాలం జీవించే ఉంటుంది.

This post was last modified on November 10, 2025 12:38 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

18 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago