Political News

జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్ర‌చారం.. రేవంత్ 8 సార్లు.. కేటీఆర్ 32 సార్లు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించిన ప్ర‌చార ప‌ర్వం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్ ప్ర‌కారం ఆదివారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప్ర‌చారానికి అవ‌కాశం ఉండ‌గా.. దాదాపు నియోజ‌కవ‌ర్గంలో సాయంత్రం దీనికి ప‌దినిమిషాల ముందే.. అభ్య‌ర్థులు మైక్ ప్ర‌చారాన్ని.. బ‌హిరంగ స‌భ‌ల‌ను కూడా ముగించారు. ఇక‌, ఇప్ప‌టి నుంచి అభ్య‌ర్థులు ఒకరిద్దరుగా ఇంటింటి ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంది.

ఇక‌, అక్టోబ‌రు 6న ఈ ఉపఎన్నిక‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ద‌రిమిలా.. అదే నెల 13 నుంచి నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఇక‌, అక్టోబ‌రు 10వ తేదీ నుంచి బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌చారం ప్రారంభించ‌గా.. కాంగ్రెస్ పార్టీ అదే నెల 15వ తేదీ నుంచి ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టింది. అంద‌రికన్న ఆల‌స్యంగా బీజేపీ త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంతో ఈ పార్టీ చాలా ఆల‌స్యంగా ప్ర‌చార ప‌ర్వంలోకి దిగింది. మొత్తంగా 22 రోజుల పాటు హోరా హోరీ ప్ర‌చారం జ‌రిగింది.

కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి 8 సార్లు ప్ర‌త్య‌క్షంగా ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇక‌, బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌.. 32 సార్లు ప్ర‌చారం చేశారు. ఇదేస‌మ‌యంలో బీజేపీ త‌ర‌ఫున కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి దాదాపు అన్ని రోజులు ప్ర‌చారంలోనే ఉన్నారు. అత్యంత కీల‌కంగా భావిస్తున్న ఈ ఉప పోరులో ఈ నెల 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఫ‌లితం ఇదే నెల 14న రానుంది.

అన్ని పాఠ‌శాల‌ల‌కు, ఆఫీసుల‌కు ఈ నెల 11న సెల‌వు ప్ర‌క‌టించారు. అయితే.. పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన పాఠ‌శాల‌ల‌కు 10వ తేదీ కూడా సెల‌వు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు.. కూడా సెల‌వు ప్ర‌క‌టించారు.

భారీ భ‌ద్ర‌త‌..

+ 1600 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారు.
+ 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంత‌రం బూత్‌ల‌ను ప‌రిశీలించ‌నున్నారు.
+ 38 రూట్ మొబైల్స్, 8 స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ప‌రిశీలిస్తాయి.
+ 8 క్విక్ రియాక్షన్ టీమ్‌ల‌ను  సిద్ధం చేశారు.
+  జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో 65 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
+ పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసుల ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేస్తారు.

This post was last modified on November 9, 2025 8:52 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

5 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago