Political News

‘అనంతపురం అంటే టీడీపీ..టీడీపీ అంటే అనంతపురం’

తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లా కంచుకోట వంటిది. అన్న ఎన్టీఆర్ మొదలు బాలకృష్ణ వరకు అందరినీ అనంతపురం అక్కున చేర్చుకుంది. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ వంటి నేతలను ఆ జిల్లా అందించింది. ఇక, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురంలోని 14 స్థానాలకుగాను 14 టీడీపీ కైవసం చేసుకుందంటే అక్కడ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అనంతపురం అంటేనే టీడీపీ…టీడీపీ అంటేనే అనంతపురం అంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

2 రోజుల పర్యటన కోసం లోకేశ్ అనంతపురం వెళ్లారు. తొలి రోజు పర్యటనలో భాగంగా కల్యాణదుర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే అనంతపురం.. అనంతపురం అంటే టీడీపీ అని అన్నారు. తమ కుటుంబాన్ని అనంతపురం ప్రజలు ఆశీర్వదించి దీవించారని, ఎన్టీఆర్ గారిని, హరికృష్ణ గారిని, బాలకృష్ణ గారిని గెలిపించారని గుర్తు చేసుకున్నారు. అనంతపురం. జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు.

కల్యాణదుర్గంలో భక్త కనకదాస 538వ జయంతి కార్యక్రమానికి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని లోకేశ్ ఆవిష్యరించారు. కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా తొలి జయంతిని కల్యాణదుర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ వర్గీయుల అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పారు. కురబ సోదరులు ఎన్నో ఏళ్లుగా టీడీపీతో ఉన్నారని, వారిని తన గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. బీటీ ప్రాజెక్టును ప్రారంభించింది తామేనని, పూర్తి చేసేది కూడా తామేనని అన్నారు. కరవుసీమలో కార్లు పరుగులు పెట్టించామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నామని చెప్పారు.

This post was last modified on November 8, 2025 6:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

11 minutes ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

9 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago