తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లా కంచుకోట వంటిది. అన్న ఎన్టీఆర్ మొదలు బాలకృష్ణ వరకు అందరినీ అనంతపురం అక్కున చేర్చుకుంది. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ వంటి నేతలను ఆ జిల్లా అందించింది. ఇక, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురంలోని 14 స్థానాలకుగాను 14 టీడీపీ కైవసం చేసుకుందంటే అక్కడ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అనంతపురం అంటేనే టీడీపీ…టీడీపీ అంటేనే అనంతపురం అంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
2 రోజుల పర్యటన కోసం లోకేశ్ అనంతపురం వెళ్లారు. తొలి రోజు పర్యటనలో భాగంగా కల్యాణదుర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే అనంతపురం.. అనంతపురం అంటే టీడీపీ అని అన్నారు. తమ కుటుంబాన్ని అనంతపురం ప్రజలు ఆశీర్వదించి దీవించారని, ఎన్టీఆర్ గారిని, హరికృష్ణ గారిని, బాలకృష్ణ గారిని గెలిపించారని గుర్తు చేసుకున్నారు. అనంతపురం. జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు.
కల్యాణదుర్గంలో భక్త కనకదాస 538వ జయంతి కార్యక్రమానికి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని లోకేశ్ ఆవిష్యరించారు. కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా తొలి జయంతిని కల్యాణదుర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ వర్గీయుల అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పారు. కురబ సోదరులు ఎన్నో ఏళ్లుగా టీడీపీతో ఉన్నారని, వారిని తన గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. బీటీ ప్రాజెక్టును ప్రారంభించింది తామేనని, పూర్తి చేసేది కూడా తామేనని అన్నారు. కరవుసీమలో కార్లు పరుగులు పెట్టించామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నామని చెప్పారు.
This post was last modified on November 8, 2025 6:10 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…