100 బండ్లు దొంగతనం చేశా…నా మీద కేసులున్నాయి…ఏం చేసుకుంటారో చేసుకోండి….అంటూ పోలీసులకు ఓ బైక్ దొంగ సవాల్ విసిరాడు. తన మిత్రులతో పందెం కాసి మరీ దమ్ముంటే పట్టుకోరా షెకావత్….పట్టుకుంటే వదిలేస్తా బైక్ దొంగతనాలు.. అంటూ ఏకంగా ఓ వీడియో చేశాడు. అయితే, ఇది సినిమా కాదు…కాబట్టి పోలీసులు ఆ వీడియోను చూసి ఆ దొంగను 24 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
ఏపీ పోలీస్ ఆన్ డ్యూటీ అని లోకేశ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ బైక్ దొంగను ఏలూరు పోలీసులు పట్టుకొని నడిరోడ్డు మీద నడిపిస్తూ తీసుకువెళ్తున్న వైనం వైరల్ అయింది. దొంగతనం చేశా అని ఎవిడెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి మరీ ఏలూరు పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేశారు. ఆ దొంగను రోడ్డుపై నడిపించుకుంటూ వెళుతున్న వీడియోను ఏలూరు పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా దానిని లోకేశ్ షేర్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సంగతి తెలిసిందే. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గంజాయి సేవిస్తున్న వారితో గుంజీలు తీయించారు పోలీసులు. ఇక, పొలాల్లో ప్రశాంతంగా పేకాడుతున్నాం.. మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు అనుకున్న పేకాట రాయుళ్లను కూడా పోలీస్ డ్రోన్లు పరిగెత్తించాయి. ఇలా, చంద్రబాబు హయాంలో లోకేశ్ పర్యవేక్షణలో ఏపీలో దొంగలు హడలెత్తిపోతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on November 8, 2025 4:46 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…