100 బండ్లు దొంగతనం చేశా…నా మీద కేసులున్నాయి…ఏం చేసుకుంటారో చేసుకోండి….అంటూ పోలీసులకు ఓ బైక్ దొంగ సవాల్ విసిరాడు. తన మిత్రులతో పందెం కాసి మరీ దమ్ముంటే పట్టుకోరా షెకావత్….పట్టుకుంటే వదిలేస్తా బైక్ దొంగతనాలు.. అంటూ ఏకంగా ఓ వీడియో చేశాడు. అయితే, ఇది సినిమా కాదు…కాబట్టి పోలీసులు ఆ వీడియోను చూసి ఆ దొంగను 24 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
ఏపీ పోలీస్ ఆన్ డ్యూటీ అని లోకేశ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ బైక్ దొంగను ఏలూరు పోలీసులు పట్టుకొని నడిరోడ్డు మీద నడిపిస్తూ తీసుకువెళ్తున్న వైనం వైరల్ అయింది. దొంగతనం చేశా అని ఎవిడెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి మరీ ఏలూరు పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేశారు. ఆ దొంగను రోడ్డుపై నడిపించుకుంటూ వెళుతున్న వీడియోను ఏలూరు పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా దానిని లోకేశ్ షేర్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సంగతి తెలిసిందే. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గంజాయి సేవిస్తున్న వారితో గుంజీలు తీయించారు పోలీసులు. ఇక, పొలాల్లో ప్రశాంతంగా పేకాడుతున్నాం.. మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు అనుకున్న పేకాట రాయుళ్లను కూడా పోలీస్ డ్రోన్లు పరిగెత్తించాయి. ఇలా, చంద్రబాబు హయాంలో లోకేశ్ పర్యవేక్షణలో ఏపీలో దొంగలు హడలెత్తిపోతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on November 8, 2025 4:46 pm
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…