Political News

దమ్ముంటే పట్టుకోరా శికవత్తు అని పోలీసులకు దొంగ సవాల్

100 బండ్లు దొంగతనం చేశా…నా మీద కేసులున్నాయి…ఏం చేసుకుంటారో చేసుకోండి….అంటూ పోలీసులకు ఓ బైక్ దొంగ సవాల్ విసిరాడు. తన మిత్రులతో పందెం కాసి మరీ దమ్ముంటే పట్టుకోరా షెకావత్….పట్టుకుంటే వదిలేస్తా బైక్ దొంగతనాలు.. అంటూ ఏకంగా ఓ వీడియో చేశాడు. అయితే, ఇది సినిమా కాదు…కాబట్టి పోలీసులు ఆ వీడియోను చూసి ఆ దొంగను 24 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.

ఏపీ పోలీస్ ఆన్ డ్యూటీ అని లోకేశ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ బైక్ దొంగను ఏలూరు పోలీసులు పట్టుకొని నడిరోడ్డు మీద నడిపిస్తూ తీసుకువెళ్తున్న వైనం వైరల్ అయింది. దొంగతనం చేశా అని ఎవిడెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి మరీ ఏలూరు పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేశారు. ఆ దొంగను రోడ్డుపై నడిపించుకుంటూ వెళుతున్న వీడియోను ఏలూరు పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా దానిని లోకేశ్ షేర్ చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సంగతి తెలిసిందే. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గంజాయి సేవిస్తున్న వారితో గుంజీలు తీయించారు పోలీసులు. ఇక, పొలాల్లో ప్రశాంతంగా పేకాడుతున్నాం.. మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు అనుకున్న పేకాట రాయుళ్లను కూడా పోలీస్ డ్రోన్లు పరిగెత్తించాయి. ఇలా, చంద్రబాబు హయాంలో లోకేశ్ పర్యవేక్షణలో ఏపీలో దొంగలు హడలెత్తిపోతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.

This post was last modified on November 8, 2025 4:46 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Eluru thief

Recent Posts

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

11 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

28 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

3 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

6 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

6 hours ago