Political News

సాయిరెడ్డి కుమార్తెకు షాక్‌

ఒక అక్ర‌మం.. అన్యాయం చేయాలంటే.. ఎంతో సాహ‌సం ఉండాలి. పైగా ఎవ‌రినో ఒక‌రిని చూసైనా నేర్చు కోవాలి. ఇలానే స్ఫూర్తి పొందిన వైసీపీ మాజీ నాయ‌కుడు, మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కుమార్తె.. నేహా రెడ్డి ఇప్పుడు కోట్ల సొమ్మును వ‌దిలించుకుంటున్నారు. అక్ర‌మ‌మ‌ని తెలిసి కూడా.. స‌క్ర‌మంగా మార్చే ప్ర యత్నాలు చేసి.. చిక్కుల్లో ప‌డ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు… అనేక మంది అక్ర‌మాలు చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అయితే.. సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి.. మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. రుషికొండ‌పై అప్ప‌టి ప్ర‌భు త్వం భారీ భ‌వ‌నాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇది ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ చ‌ట్టాల‌కు వ్య‌తిరేక‌మ‌ని పేర్కొంటూ.. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌ను తెర‌మీదికి వ‌చ్చాయి. అయినా.. వైసీపీ ప్ర‌భుత్వం ఎక్క‌డా వినిపించుకోలేదు. పైగా.. నిర్మాణాల‌ను కొన‌సాగించి.. 500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసింది. ఈ నేప‌థ్యంలో సాయిరెడ్డి కుమార్తె కూడా.. ఇలాంటి నిర్మాణాల‌కే ప్రాధాన్యం ఇచ్చారు.

భీమిలిలోని బీచ్‌లో స‌ముద్ర తీరాన్ని ఆక్ర‌మించి రిసార్టు ఏర్పాటు చేయాల‌ని నేహారెడ్డి ప్ర‌య‌త్నించారు. అప్ప‌ట్లో వైసీపీ ప్ర‌భుత్వం ఉండ‌డంతో నిర్మాణాలు ముందుకు సాగాయి. కానీ.. వాస్త‌వానికి కేంద్ర ప‌ర్యావ ర‌ణ‌, స‌ముద్ర చ‌ట్టాల ప్ర‌కారం.. బీచ్‌లో ఎలాంటి రిసార్టులు క‌ట్టేందుకు అనుమ‌తిలేదు. దీని గురించి తెలిసినా.. జ‌గ‌న్ బాట‌లోనే మొండిగా ముందుకు సాగారు సాయిరెడ్డి కుమార్తె. పెద్ద ఎత్తున ప్ర‌హ‌రీ నిర్మించారు. అనంత‌రం.. రిసార్టుకు అవ‌స‌ర‌మైన నిర్మాణాల‌ను కూడా ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.

ఇంత‌లో ఇది కోర్టుకు చేరింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యిన గోడ‌ను కూల్చేయ‌డంతోపాటు.. ప‌ర్యావ‌రణ ప‌రిర‌క్ష‌ణ‌కు భంగం వాటిల్లేలా చేసినందుకు.. 17 కోట్ల రూపాయ‌ల ఫైన్ ప‌డింది. ఇక‌, ఇప్ప‌టికే క‌ట్టిన గోడ‌ను కూల్చేందుకు ఒక‌సారి 48 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెల్లించారు. అయితే.. ఆ సొమ్ము స‌గం గోడ‌ను మాత్ర‌మే కూల్చేందుకు స‌రిపోయాయ‌ని కార్పొరేష‌న్ స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు 37 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కోరింది. దీనిని తాజాగా హైకోర్టు కూడా స‌మ‌ర్థించింది. సో.. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ బాట‌లో మొండిగా న‌డిచి.. సాయిరెడ్డి కుమార్తె..చేతి చ‌మురు బాగానే వ‌దిలించుకుంటున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

32 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

9 hours ago