ఏపీ రాజధాని అమరావతిలో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాజధానిలో ప్రారంభం కానున్న క్వాంటమ్ వ్యాలీలో తాను కూడా భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఏకంగా 1200 క్యూబిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి గతంలోనే సీఎం చంద్రబాబు.. మైక్రోసాఫ్ట్తో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. దీనిపై తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందింది.
ఎంత పెట్టుబడి?
మైక్రోసాఫ్ట్.. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే 1200 క్యూబిట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ కోసం.. ఏకంగా 1,772 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ నిధులతో క్వాంటమ్ వ్యాలీలో 4 వేల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించనున్నారు. తద్వారా.. స్థానికంగా ఐటీ చదివిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తొలిదశలో 1500 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరులకు వెళ్లిన ఏపీ యువతకు.. ఇక్కడే అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది.
ఇదే కాదు..
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించిన తర్వాత.. ఆయన చొరవ తీసుకుని సంప్రదించిన కంపెనీలతో పాటు.. మరిన్ని సంస్థలు కూడా.. స్వచ్ఛందంగా వచ్చేందుకు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటితో అంతర్జాతీయంగా కూడా ఏపీ రాజ ధాని పేరు మార్మోగనుంది. ప్రధానంగా జపాన్కు చెందిన కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు సర్కారు పేర్కొంది.
ఇవీ.. వచ్చేవి..
1) జపాన్కు చెందిన ఫుజిసు ఐటీ కంపెనీ 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది.
2) కేంద్ర ప్రభుత్వం.. ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది.
3) మైక్రోసాఫ్ట్ సహా.. గూగుల్ ప్రతిపాదిత కంపెనీలు రానున్నాయి.
This post was last modified on November 7, 2025 9:51 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…