ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. హరియాణాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సర్దార్జీగా అభివర్ణించారు. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమీషన్ వేగంగా స్పందించింది. ఆయన చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది.
ఈ రోజు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఓట్ చోరీపై మీడియా సమావేశం నిర్వహించారు. హరియాణాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ వాళ్లు అయినంత మాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వేలాది మందికి ఉత్తరప్రదేశ్, హరియాణాలో ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇళ్లు లేని ఓటర్లకు ఇంటి నెంబర్ జీరో ఇచ్చామని ఈసీ చెప్పింది. అటువంటి వాటిని మేము తనిఖీ చేశాం. ఆ ఓటర్లకు ఇళ్లు ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు.
అనేక మంది చిరునామాలు తనిఖీ చేయకుండానే ఓట్లు ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎటువంటి కారణాలు లేకుండా 3.5 లక్షల మంది ఓట్లను తొలగించారని అన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే అని తెలిపారు. బీజేపీకి చెందిన ఒక ఇంట్లోనే 66 ఓట్లు ఉన్నాయని అన్నారు. మరో ఇంట్లో ఏకంగా 501 ఓట్లు ఉన్నాయని తెలిపారు. మరో చిన్న ఇంటిలో 108 ఓట్లు ఉన్నాయన్నారు. ఒక ఇంటిలో 10కిపైగా ఓట్లు ఉంటే తనిఖీ చేయాలని నిబంధన ఉన్నా దానిని అమలు చేయలేదని తెలిపారు.
ఈసీ బీజేపీకి సహాయం చేసిందన్నారు. హరియాణాలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ఓటర్లు ఉన్నారని తెలిపారు. తప్పుడు చిరునామాలతో 93 వేల ఓట్లు, ఒకే ఫొటోతో రెండు బూత్ లలో 223 ఓట్ల ఉన్నాయని ఆరోపించారు. ఈసీని అడ్డు పెట్టుకుని బీజేపీ హరియాణాలో సర్కార్ చోరీ చేసిందన్నారు. ఇప్పుడు బిహార్లో ఓట్ల చోరీకి బీజేపీ యత్నిస్తుందన్నారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయని రాహుల్ తెలిపారు.
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…