ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. హరియాణాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సర్దార్జీగా అభివర్ణించారు. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమీషన్ వేగంగా స్పందించింది. ఆయన చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది.
ఈ రోజు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఓట్ చోరీపై మీడియా సమావేశం నిర్వహించారు. హరియాణాలో ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ వాళ్లు అయినంత మాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వేలాది మందికి ఉత్తరప్రదేశ్, హరియాణాలో ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇళ్లు లేని ఓటర్లకు ఇంటి నెంబర్ జీరో ఇచ్చామని ఈసీ చెప్పింది. అటువంటి వాటిని మేము తనిఖీ చేశాం. ఆ ఓటర్లకు ఇళ్లు ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు.
అనేక మంది చిరునామాలు తనిఖీ చేయకుండానే ఓట్లు ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎటువంటి కారణాలు లేకుండా 3.5 లక్షల మంది ఓట్లను తొలగించారని అన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే అని తెలిపారు. బీజేపీకి చెందిన ఒక ఇంట్లోనే 66 ఓట్లు ఉన్నాయని అన్నారు. మరో ఇంట్లో ఏకంగా 501 ఓట్లు ఉన్నాయని తెలిపారు. మరో చిన్న ఇంటిలో 108 ఓట్లు ఉన్నాయన్నారు. ఒక ఇంటిలో 10కిపైగా ఓట్లు ఉంటే తనిఖీ చేయాలని నిబంధన ఉన్నా దానిని అమలు చేయలేదని తెలిపారు.
ఈసీ బీజేపీకి సహాయం చేసిందన్నారు. హరియాణాలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ఓటర్లు ఉన్నారని తెలిపారు. తప్పుడు చిరునామాలతో 93 వేల ఓట్లు, ఒకే ఫొటోతో రెండు బూత్ లలో 223 ఓట్ల ఉన్నాయని ఆరోపించారు. ఈసీని అడ్డు పెట్టుకుని బీజేపీ హరియాణాలో సర్కార్ చోరీ చేసిందన్నారు. ఇప్పుడు బిహార్లో ఓట్ల చోరీకి బీజేపీ యత్నిస్తుందన్నారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయని రాహుల్ తెలిపారు.
This post was last modified on November 5, 2025 6:00 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…