Political News

వింత వ్యాఖ్యలతో ఆశ్చర్యానికి గురి చేసిన జగన్

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా మ‌రోసారి వింత వ్యాఖ్య‌లు చేశారు. “అవును.. జ‌గ‌న‌న్న ఉంటే ఇలా జ‌రిగేది కాదు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికిఆయ‌న ఏ కాంటెస్టులో ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దుకానీ.. దీనికి రైతులు కొంద‌రు న‌వ్వుకున్నారు. ఇటీవ‌ల గూగుల్ డేటా కేంద్రంపైనా ఆయ‌న ఇలానే వ్యాఖ్యానించి సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌కు గుర‌య్యారు. తాజాగా కృష్ణాజిల్లాలో మొంథా తుఫాను ప్ర‌భావంతో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారిని ఓదార్చారు. స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్ష నేత కాబ‌ట్టి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ క్ర‌మంలో “నేనుంటే ఇలా జ‌రిగేది కాదు“ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఆయ‌న ఉంటే మొంథా తుఫాను వ‌చ్చేది కాద‌న్న అర్థంలో అన్నారో.. లేక సాయం విష‌యంలో అన్నారో.. తెలియ‌క రైతులు దిక్కులు చూశారు. ఇక‌, కృష్ణాజిల్లా రామరాజుపాలెం ప్రాంతంలోని ఆకుమర్రు లాకు వద్ద పంట పొలాలను జ‌గ‌న్ పరిశీలించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా కొంద‌రు రైతులు త‌మ పొలాల్లోకి దిగాల‌ని సూచించినా.. జ‌గ‌న్‌.. మాత్రం గ‌ట్టుపైనే ఉండి ప‌రిశీలించారు. దీంతో ప‌లువురు రైతులు.. త‌డిసిపోయిన పంట‌ల‌ను జ‌గ‌న్‌కు చూపించారు.

అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ.. త‌మ హ‌యాంలో రైతుల‌ను ఆదుకున్నామ‌ని.. వారికి బీమా క‌ల్పించామ‌ని చెప్పారు. వైసీపీ పాల‌న‌లో 85 ల‌క్ష‌ల మంది రైతుల‌కు బీమా అందిస్తే.. ఇప్పుడు ఈ సంఖ్య 19 ల‌క్ష‌ల‌కు కుదించార‌ని విమ‌ర్శించారు. మొత్తంగా 25 జిల్లాల్లో పంట‌న‌ష్టం జ‌రిగింద‌న్న ఆయ‌న‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. రైతుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని, వారికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని చెప్పారు. మ‌రికొంద‌రు రైతులు.. త‌మ వ‌ద్ద‌కు అధికారులు వ‌చ్చి వివ‌రాలు తీసుకుని వెళ్లార‌ని చెప్పారు.

అనంత‌రం జ‌గ‌న్ మీడియాతోనూ మాట్లాడారు.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అన్నివిష‌యాల్లోనూ విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. రైతుల‌కు స‌రైన స‌మ‌యంలో సొమ్ములు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. మొంథా తుఫాను వ‌స్తుంద‌న్న హెచ్చ‌రిక‌లు ఉన్నా.. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోకుండా తాత్సారం చేయ‌డంతో రైతులు న‌ష్ట‌పోయార‌ని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైసీపీ వారికి అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. 25 జిల్లాల్లో మొంథా తుఫాను ప్ర‌భావం క‌నిపించింద‌ని, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, కానీ ప్ర‌భుత్వం తూతూమంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. కూట‌మి పాల‌న‌లో రైతుల‌కు క్రాప్ ఇన్సూరెన్స్(పంట‌ల బీమా) ఇవ్వ‌డం లేదని అన్నారు.

This post was last modified on November 4, 2025 8:47 pm

Share
Show comments
Published by
Kumar
Tags: JaganMontha

Recent Posts

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

14 minutes ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

1 hour ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

3 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

4 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

5 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

6 hours ago