Trends

అజారుద్దీన్‌కి ఏమేమి శాఖలు ఇచ్చారంటే!

మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్‌ గత నెల 31న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బెర్త్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

అప్పట్లో అజారుద్దీన్‌కు హోం శాఖ కట్టబోతున్నారనే ప్రచారం బలంగా సాగింది. ప్రస్తుతం హోం శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండటం, జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇది వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు తాజాగా అజారుద్దీన్‌కు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను అప్పగించారు. మైనారిటీ సంక్షేమ శాఖ పాతదే అయినా, కొత్తగా పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ అనే శాఖను సృష్టించడం గమనార్హం. గత కేసీఆర్ మంత్రివర్గంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ శాఖ లేదు. కాబట్టి ఇది అజారుద్దీన్‌ కోసం ప్రత్యేకంగా సృష్టించారని అంటున్నారు.

ఇప్పుడు శాఖల కేటాయింపు పూర్తవడంతో అజారుద్దీన్‌ పని ప్రారంభించనున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంది. కానీ, ఇక్కడ కొన్ని కీలకమైన సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. ముఖ్యంగా మక్కాకు వెళ్లే వారికి ప్రభుత్వ సాయం పెంచుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. అలాగే రుణాల కోసం ఎదురుచూస్తున్న మైనారిటీ యువతకు సాయం చేయడం కూడా ప్రాధాన్యంగా ఉంది.

పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ కొత్తదైనందున, దీని ద్వారా యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏదేమైనా, ప్రచారం జరిగినట్లుగా హోం శాఖ దక్కకపోయినా, అజారుద్దీన్‌కు ఇచ్చిన కొత్త బాధ్యతలు గమనించదగ్గవే.

This post was last modified on November 4, 2025 5:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: Azharuddin

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

35 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

54 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago