మొంథా తుఫాను.. పలు ప్రభావిత జిల్లాల ప్రజలకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కానీ, ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్లకు కూడా నిద్రలేకుండా చేస్తోందన్న విషయం చాలా మందికి తెలియదు. గత రెండు రోజులుగా సీఎం చంద్రబాబు అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉదయం 10 నుంచి రాత్రి 11-12 గంటల వరకు గడిపారు. మంగళవారం రాత్రి అయితే.. ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత.. కూడా ఆర్టీజీఎస్లోనే ఉన్నారు.
తీవ్ర తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంలోనే కూర్చుని మంగళవారం రాత్రి వరకు మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తీవ్ర తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం నుంచి ఐదారుగురితో ఓ బృందాన్ని పంపించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో ఉంటే… ప్రజలకు భరోసా కలుగుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. భారీ వర్షాల కారణంగా కాల్వలు, చెరువులు రోడ్లకు ఎక్కడైనా కోతలు, గండ్లు పడ్డాయా అనే అంశంపై రాత్రిపూట కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు.
క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయడంతోపాటు.. టెక్నాలజీని వినియోగించుకున్నారు. శాఖల వారీగా నష్టం అంచనా నివేదికలను సిద్దం చేయాలని కూడా రాత్రే ఆదేశించడం గమనార్హం. వర్షాల ప్రభావం తగ్గగానే యుద్ద ప్రాతిపదికన విద్యుత్తును పునరుద్దరించాలని సూచించారు. జిల్లాల్లోని పరిస్థితిని చంద్రబాబుకు ఫోన్ ద్వారా మంత్రులు వివరించారు. ఇదంతా.. తుఫాను ప్రభావ సమయంలోనే జరగడం విశేషం. వాస్తవానికి తుఫాను ప్రభావం తగ్గాక సమీక్షిస్తారు. కానీ, బాబు అలా కాకుండా.. తుఫాను సమయంలోనే అన్నీ సేకరించారు.
ఇక, తీవ్ర తుఫాను తీవ్రతపై అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి నారా లోకేష్ మంగళవారం రాత్రంతా ఉన్నారు. బుధవారం(ఈ రోజు ) ఉదయం 7 గంటలకు కూడా ఆయన జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు ఆదేశించారు. గతరాత్రి ఆయ ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేసిన ఆయన గంట గంటకు పరిస్థితిని తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయని.. వాటి ప్రభావంతో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.
This post was last modified on October 29, 2025 11:29 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…