Political News

ఒక్కొక్క కుటుంబానికీ 3 వేలు.. మ‌రోసారి బాబు పెద్ద మ‌న‌సు!

సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. ప్ర‌స్తుతం దోబూచులాడుతున్న మొంథా తుఫాన్ ప్ర‌భావిత జిల్లాల్లో ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లోని ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు చేర్చారు. నిజానికి తుఫాను ఎఫెక్ట్ ఉంటుంద‌ని భావిస్తున్నా.. సోమ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత‌.. తేలిపోయే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం అంచ‌నా వేసింది. అయిన‌ప్ప‌టికీ.. వంద‌లాది గ్రామాల్లోని తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను కొంత దూరంగా ఉన్న షెల్ట‌ర్ల‌లోకి తీసుకువ‌చ్చారు. వీరికి స‌క‌ల ఏర్పాట్లు చేశారు. ప్ర‌తి ఒక్క‌రికీ దుప్ప‌టి, ఉద‌యం ఆహారం, మ‌ధ్యాహ్న భోజ‌నం,రాత్రి భోజ‌నాలు, తాగునీరు, టీ, పాలు వంటివి క‌ల్పించారు.

వీటితో పాటు.. పున‌రావాస కేంద్రాల్లో త‌ల‌దాచుకుంటున్న ఒక్కొక్క‌ కుటుంబానికీ రూ.3 వేల చొప్పున న‌గ‌దు ఇవ్వాల‌ని.. క‌లెక్ట‌ర్ల‌ను సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికీ రేష‌న్ కింద‌.. 25 కేజీల బియ్యం, కిలో ఉల్లిపాయలు, ఆయిల్‌, గోధుమ పిండి, ఉల్లిపాయ‌లు స‌హా.. ఇత‌ర అవ‌స‌రాల‌కు స‌బ్బులు, స‌ర్ఫులు కూడా త‌గిన‌న్ని ఇవ్వాల‌ని సూచించారు. అదేస‌మ‌యంలో వారిని త్వ‌ర‌ప‌డి ఇళ్ల‌కు పంపించేయొద్ద‌ని.. రెండు మూడు రోజులు అయినా.. పున‌రావాస కేంద్రాల్లో ఉండ‌నివ్వాల‌ని ఫ్యాన్లు ఏర్పాటు చేయాల‌నికూడా ఆదేశించారు.

ప్ర‌స్తుతం కాకినాడ‌, బాప‌ట్ల‌, నెల్లూరు, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా జిల్లాల‌లో పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. వీటిని మానిట‌రింగ్ చేసేందుకు ప్ర‌త్యేక అధికారుల‌ను కూడా నియ‌మించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా స‌మాచారాన్ని అందించాల‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఎక్క‌డా ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం తీసుకుంటున్న ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు.. భ‌విష్య‌త్తులో తుఫాన్ల‌ను ఎదుర్కొనేందుకు ఒక రోల్ మోడ‌ల్ మాదిరిగా ఉప‌యోగ‌ప‌డాల‌ని సూచించారు. ఈమేర‌కు క‌లెక్ట‌ర్లు.. జిల్లాల అధికారులు.. విప‌త్తు నిర్వ‌హ‌ణ అధికారులు కూడా స‌మన్వ‌యంతో ప‌నిచేయాల‌ని ఆదేశించారు.

Kumar

Recent Posts

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి…

3 hours ago

రణ్వీర్ నిషేధం… హీరోలకు ఒక పాఠం

రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…

5 hours ago

భార‌త్ బంగారం అమ్మేసిందా?

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇంధ‌నం, బంగారం దిగుమ‌తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం భారీ స్థాయిలో విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని వెచ్చిస్తున్న విష‌యం…

6 hours ago

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

8 hours ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

9 hours ago

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…

9 hours ago