మాస్ మహారాజా రవితేజని వింటేజ్ పాత్రలో చూసి చాలా రోజులయ్యింది. ఒకరిద్దరు దర్శకులు ఆ దిశగా ప్రయత్నాలు చేద్దామని సినిమాలు తీశారు కానీ అవి ఆడియన్స్ అంచనాలు అందుకోలేక నిరాశ పరిచాయి. సోలో హీరోగా ధమాకా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బొమ్మే కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ కోరికకు అనుగుణంగా రూపొందిన మాస్ జాతర అక్టోబర్ 31 సాయంత్రం షోల నుంచి విడుదలకు రెడీ అవుతోంది. స్టార్ రైటర్ భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు హీరోయిన్ శ్రీలీల, భీమ్స్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
స్టోరీని దాచలేదు. సింగల్ పాయింట్ లో చెప్పేశారు. రైల్వే పోలీస్ గా పని చేసే లక్ష్మణ్ భేరి (రవితేజ) కు అన్యాయమంటే ఒళ్ళు మంట. స్మగ్లింగ్ తో ఆ ప్రాంతాన్ని చెప్పు చేతల్లో పెట్టుకున్న ఓ మాఫియా లీడర్ (నవీన్ చంద్ర) తో కోరి శత్రుత్వం తెచ్చుకుంటాడు. పెంచి పెద్ద చేసిన తాత (రాజేంద్రప్రసాద్), ఇష్టపడిన ప్రియురాలు (శ్రీలీల) ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న లక్ష్మణ్ లైఫ్ లోకి అనుకున్నట్టే ప్రమాదాలు వచ్చి పడతాయి. లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుని వాటికి ఎదురు వెళ్తాడు. ఇంతకీ రైల్వే పోలీస్ ఇంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని మట్టుబెట్టేందుకు ఎందుకు పూనుకున్నాడనేది తెరమీద చూడాలి.
విజువల్స్ చూస్తుంటే అభిమానులకు ఫుల్ మీల్స్ లాగే ఉంది. కాకపోతే కథ రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండటం, కమర్షియల్ మీటర్ కు అనుగుణంగా భాను భోగవరపు అన్ని అంశాలు మేళవించడంతో కామన్ ఆడియన్స్ కి ఎంత స్థాయిలో కనెక్ట్ అవుతాయో చూడాలి. ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ తో పెద్దగా పని ఉండదు కానీ కంటెంట్ కనక మాస్ మెచ్చుకునేలా ఉంటే బ్లాక్ బస్టర్ ఖాయం. ఆ వైబ్స్ అయితే ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విక్రమార్కుడు పోలీస్ డ్రెస్సుకి కిక్ స్టైల్ లో వినోదాన్ని జోడించి ఈ మాస్ జాతరని రూపొందించినట్టు కనిపిస్తోంది. అక్టోబర్ నెలను రవితేజ ఎంత పెద్ద సక్సెస్ తో ముగిస్తాడో చూడాలి.
This post was last modified on October 28, 2025 9:43 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…