Political News

చంద్ర‌బాబుకు మోడీ ఫోన్‌: కీల‌క స‌మ‌యంలో స్పెష‌ల్ అటెన్ష‌న్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా సోమ‌వారం ఉద‌యం ఫోన్ చేశారు. ప్ర‌స్తుతం మొంథా తుఫాను ప్ర‌భావంతో తీర ప్రాంత జిల్లాలు ప్ర‌భావితం అయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి సోమ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు తుఫాను దోబూచులాడుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. సోమ‌వారం రాత్రి నుంచి తుఫాను ప్ర‌భావం పెరిగే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు. అధికారుల‌ను రంగంలోకి దించారు.

ఈ నేప‌థ్యంలో ఊహించ‌ని విధంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి చంద్ర‌బాబుకు ఫోన్ కాల్ వ‌చ్చింది. సోమ‌వారం(ఈరోజు) ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యంలో ఫోన్ చేసిన ప్ర‌ధాని.. మొంథా తుఫాను ప్ర‌భావం స‌హా.. ప్ర‌స్తుతం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఆరా తీశారు. ఎలాంటి సాయం కావాల‌న్నా.. కేంద్రం నుంచి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎప్పుడైనా సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని.. అధికారులు అందుబాటులో ఉంటార‌ని ప్ర‌ధాని వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రికి సీఎం చంద్ర‌బాబు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మొంథా తుఫాను, చేప‌డుతున్న చ‌ర్య‌ల‌పై చంద్రబాబు మోడీకి వివరించారు. కాగా.. 2015-16మ‌ధ్య కూడా తితిలీ తుఫాను వ‌చ్చిన‌ప్పుడు.. ప్ర‌ధాని ఇదే విధంగా స్పందించారు. అయితే.. అప్ప‌టికి ఇప్ప‌టికి ఎన్డీయే కూట‌మిలో ఏర్ప‌డిన అనుబంధం నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి మ‌రింత చొర‌వ తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను సీఎం చంద్ర‌బాబు ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు.

రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ కేంద్రానికి ఈ రోజు ఉద‌య‌మే చేరుకున్న ముఖ్య‌మంత్రి.. తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లోని అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించారు. ప్ర‌తి విష‌యాన్నీ జాగ్ర‌త్త‌గా అధ్య‌య‌నం చేయాల‌ని.. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా చూడాల‌ని ఆదేశించారు. ‘‘ప్రతి గంటకూ తుపాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.“ అని ఆయ‌న పేర్కొన్నారు.

This post was last modified on November 2, 2025 10:43 am

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago