Political News

ఈసీ ఎఫెక్ట్: సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంతంతే!

బీహార్ అసెంబ్లీ సహా, తెలంగాణ సహా ప‌లు రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి. నవంబరు 9, 11 తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని సీఎం ఒమర్ అబ్దుల్లా నియోజకవర్గం బుడ్గమ్ నియోజకవర్గానికి, అదేవిధంగా మరొక నియోజకవర్గం నగ్రోతాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇక బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ ఉప ఎన్నికలను ప్రాధాన్యంగా భావిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రచార పర్వానికి అన్ని ప్రాంతాల్లోనూ 15-17 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రచార పర్వంలో అన్ని పార్టీలు కీలక రోల్ పోషిస్తున్నాయి. సహజంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని రూపాల్లోనూ ప్రచారం జోరుగా సాగింది. దీనిలో ప్రధానంగా సోషల్ మీడియా కీలక రోల్ పోషించింది. మీమ్స్ నుంచి కామెంట్ల వరకు, వీడియోల నుంచి ఆడియోల వరకు, సినిమాల నుంచి సీరియళ్ల వరకు కూడా ప్రచారాన్ని పార్టీలు జోరుగా ముందుకు తీసుకువెళ్లాయి. ముఖ్యంగా చేతిలో ఉండే ఫోన్‌లో వాట్సాప్, యూట్యూబ్ ప్రచారాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీలు ప్రయత్నించాయి.

అయితే ఈసారి బీహార్ నుంచి ఉప ఎన్నికలు జరవబోయే రాష్ట్రాల వరకూ కూడా సోషల్ మీడియాలో పెద్దగా కదలిక కనిపించడం లేదు. అంతా బహిరంగ ప్రచారానికే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నిజానికి సోషల్ మీడియాలో వీడియోలు, కామెంట్లు వస్తాయని అందరూ అనుకున్నా, ఈసారి పార్టీలు వాటికి దూరంగా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఉన్న జోరు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. స్వల్పంగానే ప్రచారం సాగుతోంది. అది కూడా ఎక్కడా పరుషపదాలు వాడకుండా, వ్యక్తిగత విమర్శలు చేయకుండా, పార్టీపై ఎద్దేవా చేయకుండా సోషల్ మీడియా ప్రచారం సైలెంట్ అయిపోయింది.

దీనికి కారణం ఈ దఫా ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం సోషల్ మీడియాపై అనేక ఆంక్షలు విధించింది. సోషల్ మీడియా ప్రచారం చేసుకునేవారు ముందుగానే ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. అంతేకాదు ప్రతి వీడియో, ఆడియోను ఎన్నికల అధికారి మానిటరింగ్ చేస్తారని తెలిపింది. ఎవరినీ దూషించడం, ఎద్దేవా చేయడం, వెకిలి వ్యాఖ్యలు చేయడం వంటి వాటిని పూర్తిగా నిషేధించింది. యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇలా అన్ని మాధ్యమాలపైనా కొరడా ఝళిపించింది. వీటిలో ఎక్కడైనా అభ్యర్థి ఇష్టానుసారం వ్యవహరిస్తే అభ్యర్థిత్వం రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సోషల్ మీడియా ప్రచారానికి పార్టీలు దాదాపు దూరంగానే ఉన్నాయని చెప్పాలి.

Satya

Recent Posts

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

47 minutes ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

7 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

7 hours ago

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు..…

8 hours ago

అతిథిని ఎక్కువగా అంచనా వేశారు

మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…

9 hours ago

జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…

9 hours ago