Political News

అమరావతికి 100 కోట్ల విరాళం.. ఎందుకంటే!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి భారీ విరాళం ల‌భించింది. 100 కోట్ల రూపాయ‌ల విరాళం ఇవ్వ‌నున్న‌ట్టు దుబాయ్ కు చెందిన శోభా గ్రూప్ సంస్థ‌ చైర్మన్ పీఎన్సీ మీనన్ తెలిపారు. ఈ నిధుల‌తో ప్ర‌పంచ స్థాయి గ్రంథాల‌యాన్ని నిర్మించాల‌ని మీన‌న్ సూచించారు. ప్ర‌స్తుతం దుబాయ్‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర బాబును క‌లుసుకున్న మీన‌న్‌.. ఈ మేర‌కు ప్ర‌తిపాదించారు. బుధ‌వారం సాయంత్రం దుబాయ్‌లో సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయిన మీన‌న్‌.. రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు.

అయితే.. తాము లైబ్ర‌రీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని.. ఇది ప్ర‌పంచ స్థాయిలో ఉండాల‌ని ఆయ‌న సూచించారు. దీనిని సీఎం చంద్ర‌బాబు స్వాగ‌తించారు. ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయం నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించటంపై ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామని సీఎం ఆయనకు వివరించారు.

రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టి సంస్థ కూడా భాగస్వామి కావాలని సీఎం ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో నగరాలు నిర్మితం అవుతున్నాయని వాటితో సమానంగా మౌలిక సదుపాయాలతో అమరావతిని నిర్మిస్తున్నట్టు సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు శోభా గ్రూప్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు.

అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతోందని చంద్రబాబు చెప్పారు. ఇక తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో రానున్న రోజుల్లో అనేక మార్పులు రానున్నాయని… మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తికి అనేక ప్రాజెక్టులు వ‌చ్చినా.. కీల‌క‌మైన గ్రంథాల‌యం ఏర్పాటు శోభ గ్రూప్ ముందుకు రావ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

This post was last modified on October 22, 2025 9:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాధికా డబుల్ స్టాండర్డ్స్… నెటిజెన్ల పంచులు

కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…

51 minutes ago

వారికి వ్యక్తిగతంగా 84 లక్షలు అందజేసిన పవన్

ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…

2 hours ago

ఏజ్ గ్యాప్… నో ప్రాబ్లం అంటున్న రకుల్

తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…

3 hours ago

పాతికేళ్ళయినా తగ్గని పడయప్ప క్రేజ్

ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…

5 hours ago

ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ `లింకులు` క‌నిపించ‌వు!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించిన ప‌లు వీడియోలు.. సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్న…

6 hours ago

టికెట్ రేట్ల పెంపు – అంతులేని కథ

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు…

6 hours ago