Political News

`సంస్థాగ‌త సైన్యం`.. ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యం.. !

ఏపార్టీకైనా.. నాయ‌కుల‌తోపాటు సంస్థాగ‌తంగా ఉండే నేత‌లే కీల‌కం. పార్టీ జెండా ప‌ట్టాల‌న్నా.. పార్టీ త‌ర‌ఫున బ‌లోపేతం చేయాల‌న్నా.. సంస్థాగ‌తంగా ఉన్న బ‌లం.. కీల‌కం. ఈ విష‌యంలో ఇత‌ర పార్టీల‌కు భిన్నంగా టీడీపీకి బ‌ల‌మైన సంస్థాగ‌త సైన్యం ఉంది. పార్టీ అనేక సంద‌ర్భాల్లో ఎత్తుప‌ల్లాలు చవి చూసింది. రాష్ట్ర విభ‌జ‌నకు ముందు వైఎస్ ధాటికి.. ఆ త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ పార్టీకి పెద్ద ఎత్తున పరీక్ష‌లు ఎదురయ్యాయి. అలాంటి స‌మ‌యంలో సంస్థాగ‌తంగా గ్రామ గ్రామానా విస్త‌రించిన టీడీపీ నాయ‌కులు.. బ‌లంగా నిలిచారు.

పార్టీని కాపాడుకున్నారు. ఇక‌, వైసీపీ హ‌యాంలోనూ పార్టీ ఉంటుందా?  ఊడుతుందా? అన్న చ‌ర్చ వ‌చ్చినప్పుడుకూడా.. సంస్థాగ‌త నాయ‌క‌త్వం బ‌లంగా నిల‌బ‌డింది. అదే.. 2024లో టీడీపీకి క‌లిసి వ‌చ్చింది. కూటమిగా ఏర్ప‌డి ప్ర‌భుత్వంలోకి రావ‌డానికి సంస్థాగ‌తంగా ఉన్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు చాలా వ‌ర‌కు మేలు చేశార‌నడంలో ఎలాంటి సందేహం లేదు. అదేస‌మయంలో పార్టీ పుంజుకునేందుకు కూడా వీరు దోహ‌ద ప‌డ్డారు. ఇక‌, వైసీపీకి కూడా ఇలానే సంస్థాగ‌తంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నా.. వారిని అధిష్టానం ఏమ‌రుపాట‌కు గురి చేసింది. దీంతో మైన‌స్ అయ్యారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌న‌సేన పార్టీ కూడా సంస్థాగ‌తంగా పార్టీ బ‌లోపేతం పై దృష్టి పెట్టింది. ఈ నెల చివ‌రి వారం లేదా.. వ‌చ్చే నెల నుంచి జ‌న‌సేన పుంజుకునేందుకు అవ‌స‌ర‌మైన సంస్థాగ‌త పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్ట‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. నిజానికి పార్టీ ఏర్ప‌డి ప‌ది సంవత్స‌రాలు అయినా.. గ్రామంలో జండా ప‌ట్టుకునే వారు ఎక్కువగా లేర‌న్న‌ది వాస్త‌వం. ఒక్క ప‌వ‌న్‌క‌ల్యాణ్ అబిమానులు త‌ప్ప‌.. పార్టీ ప‌రంగా రాజ‌కీయంగా కూడా జెండా ప‌ట్టుకునే వారు..బల‌మైన వాయిస్ వినిపించేవారు అధికంగా లేరు.

ఇప్ప‌టికిప్పుడు పార్టీకి ఇది ఇబ్బంది కాక‌పోవ‌చ్చు. కానీ.. భ‌విష్య‌త్తులో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ప్ల‌స్సుల‌తో పాటు మైన‌స్‌లుకూడా చేర‌తాయి. అప్పుడు పార్టీని నిల‌బెట్టాలంటే ఖ‌చ్చితంగా సంస్థాగ‌తంగా ఉన్న నాయ‌కుల అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొన్నాళ్లుగా నాయ‌కుల‌ను డెవ‌ల‌ప్ చేయాల‌ని బావిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా సంస్థాగ‌తంగా పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌డం సంతోషించాల్సిన విష‌య‌మ‌ని నాయ‌కులు చెబుతున్నారు. త‌ద్వారా పార్టీ పుంజుకుంటుంద‌ని కూడా చెబుతున్నారు.

This post was last modified on October 19, 2025 1:56 pm

Share

Recent Posts

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

47 minutes ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

1 hour ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

2 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

3 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

5 hours ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

5 hours ago