భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి ఇది ఒక అతిపెద్ద ఎదురుదెబ్బ. సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన పొలిట్బ్యూరో సభ్యుడు, అగ్రనేత అయిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, మంగళవారం (అక్టోబర్ 14) మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 60 మంది కేడర్తో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో భద్రతా బలగాలు చేపట్టిన నిరంతర ఆపరేషన్ల వలన మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక ఫలితమే ఈ కీలక లొంగుబాటు అని అధికార వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణకు చెందిన ఈ నేత లొంగుబాటు వెనుక చాలా రోజులుగా ఊహాగానాలు నడిచాయి. సెప్టెంబర్లోనే అతను ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి, ఆయుధాలు వీడనున్నట్లు పరోక్షంగా సూచించారు. “తమను తామే కాపాడుకోవాలని, లొంగిపోయి మెయిన్స్ట్రీమ్లో కలవాలని” తన తోటి సహచరులకు కోరుతూ లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని మావోయిస్టు కేడర్ నుంచి సోను నిర్ణయానికి మద్దతు లభించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ లొంగుబాటు అనేది భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి ఒక ఊహించని దెబ్బగా భావిస్తున్నారు. 2026 నాటికి దేశం నుంచి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే అమిత్ షా లక్ష్యానికి ఈ పరిణామం ఒక పెద్ద విజయంగా నిలిచింది. ఒక అగ్రనాయకుడు, ఇంతమంది కేడర్తో లొంగిపోవడం అనేది ఈ ఉద్యమం బలహీనపడుతోందనడానికి స్పష్టమైన సంకేతం.
2000 సంవత్సరం ఆరంభం నుంచి భారత్ మావోయిజం లేదా నక్సలిజాన్ని (LWE లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం) ఒక తీవ్రమైన అంతర్గత భద్రతా ముప్పుగా గుర్తించింది. 2010లో ఈ ఉద్యమం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా సుమారు 200 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉండేది. అయితే, 2015లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ విధానం కార్యాచరణ ప్రణాళిక కారణంగా పరిస్థితి క్రమంగా మారింది. కేంద్ర ప్రభుత్వం, ప్రభావిత ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా, ఈ ముప్పును క్రమంగా తగ్గించింది. 2024లో, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధిత హింసాత్మక సంఘటనలు, పౌరుల మరణాలు 2010తో పోలిస్తే ఏకంగా 81 శాతం నుంచి 85 శాతం వరకు తగ్గాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్కు తెలిపింది.
This post was last modified on October 14, 2025 3:11 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…