ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న సిట్ అధికారులు ఇక్కడి ఫిల్మ్ నగర్లో ఉన్న మిథున్ రెడ్డి నివాసానికి వెళ్లి.. స్థానిక పోలీసుల సహకారంతో సిబ్బందిని తొలుత తమ అధీనంలోకి తీసుకున్నారు.
అనంతరం.. ఇంటి మొత్తాన్నీ తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి అనుమతులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే.. ఈ తనిఖీల వ్యవహారం మిథున్ రెడ్డికి తెలియదని సమాచారం. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పత్రాలు.. నాడు డిస్టిలరీలతో చేసుకున్న ఒప్పందాలపై సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి తీసుకుని.. మిథున్రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. కాగా.. గతంలోనూ ఈ కేసులో ఏ-1గా ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసంలోనూ అధికారులు సోదాలు చేశారు. ఈ సమయంలో కోటి రూపాయల నగదు, బంగారు, కీలక పత్రాలు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ క్రమంలో రెండోసారి మిథున్రెడ్డి నివాసంలో సోదాలు చేపట్టారు. ఈ వ్యవహారాన్నిగోప్యంగా ఉంచిన అధికారులు.. కేవలం చివరి నిముషంలో మిథున్ రెడ్డికి సమాచారం అందించినట్టు తెలిసింది.
మరింత బిగిసిన ఉచ్చు..
ఈ పరిణామాలతో ఇక, మద్యం కుంభకోణం తేలిపోయిందని అనుకున్న వైసీపీ నాయకులకు మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉంటుందనిపరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో కుదిపేసిన ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటికే అనేక మందిఅరెస్టు అయ్యారు. ఇప్పుడు చేస్తున్న సోదాలతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూస్తాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 14, 2025 2:28 pm
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…