Political News

టార్గెట్ 2028: విశాఖ‌పై బాబు స్ట్రాట‌జీ.. !

సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌దును పెరుగుతోంది. రోజురోజుకు ఆయ‌న త‌న ల‌క్ష్యాల‌ను మార్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా విశాఖ ప‌ట్నంపై మ‌రిన్ని ఆశ‌లు, ఆశ‌యాల‌తో సీఎం చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. గ‌తంలో వైసీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. విశాఖ‌ను రాజ‌ధానిని చేస్తామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఎంత లేద‌న్నా.. చాలా మంది ఈ ప్ర‌క‌ట‌నను స్వాగ‌తించారు. త‌మ న‌గరం బాగుప‌డుతుంద‌ని కూడా అనుకున్నారు.

ఈ క్ర‌మంలో అదేస్థాయిలో సీఎం చంద్ర‌బాబు కూడా ఆలోచ‌న చేస్తున్నారు. జ‌గ‌న్ ఉంటే.. విశాఖ బాగుండేది అనే మాట వినిపించ‌కుండా చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు విశాఖ న‌గ‌రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దేందుకు వీలుగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా `టార్గెట్ 2028 @ విశాఖ‌` అంశాన్ని చంద్రబాబు ఆవిష్క‌రించారు. అంటే.. 2028 నాటికి విశాఖ న‌గ‌రాన్ని ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దాల న్నది ఆయ‌న ప్ర‌ణాళిక‌. దీనిలో భాగంగా కేవ‌లం పెట్టుబ‌డుల‌కే ప‌రిమితం కాబోర‌న్న‌ది స్ప‌ష్టం అవుతోంది.

విశాఖ‌ను రాబోయే రోజుల్లో అత్యుత్త‌మ న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఐటీ స‌హా ప‌ర్యాట‌కం, పారిశ్రామికంగా కూడా న‌గ‌రాన్ని తీర్చి దిద్దేందుకు న‌డుం బిగించారు. త‌ద్వారా 2028 నాటికి బెస్ట్ సిటీగా విశాఖ‌ను మార్చ‌నున్నారు. ముఖ్యంగా ఐటీ, పారిశ్రామికీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వ నున్నారు. 2028 నాటికి ఐటీలో ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. అదేవిధంగా ఆర్సెలార్ మిట్ట‌ల్ ద్వారా అన‌కాప‌ల్లిలో భారీ ఐర‌న్ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా రైడెన్ సంస్థ‌కు అనుమ‌తులు ఇచ్చారు. ఈ సంస్థ 87 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డుల‌తో ఇన్ఫోటెక్ డేటా సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌నుంది. త‌ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. ఇక, ఇప్ప‌టికే ప‌ర్యాట‌కానికి ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖ‌లో ప‌ర్యాట‌క బ‌స్సుల‌ను కూడా ప్రారంభించారు. త్వ‌ర‌లోనే సీ కేబుల్ వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురాన్నారు. త‌ద్వారా.. మ‌రింత‌గా విశాఖ అభివృద్ధి చెందుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు.

This post was last modified on October 12, 2025 3:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

21 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

43 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

3 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

6 hours ago