Political News

మిథున్ రెడ్డి మెలిక‌.. వైసీపీ ఇరుక్కుపోతుందా ..!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తెచ్చిన కొత్త డిమాండ్ కూట‌మి పార్టీల‌కు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తుందా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఏపీలో తెర‌మీదికి వ‌చ్చిన‌.. న‌కిలీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో .. అనేక మంది టీడీపీ నాయ‌కుల పాత్ర ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. మ‌రింత మంది ప్ర‌మేయం ఉంద‌న్న అధికారుల వాద‌న కూడా మ‌రోవైపు వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఉరుములు లేని పిడుగు మాదిరిగా ఎంపీ మిథున్ రెడ్డి న‌కిలీ మ‌ద్యం కేసును సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ.. తంబ‌ళ్ల‌ప‌ల్లి స‌హా.. ఎన్టీఆర్‌, తూర్పుగోదావ‌రి, వెస్ట్ గోదావ‌రి జిల్లాల్లోనూ వెలుగు చూసిన‌.. న‌కిలీ మ‌ద్యం కేసుల వివ‌రాల‌తో 12 పేజీల నివేదిక‌ను కేంద్ర హోం శాఖ‌కు పంపించా రు. త‌క్ష‌ణ‌మే ఈ వ్య‌వ‌హారంపై సిబీఐ ని వేయాల‌ని.. నిజానిజాలు వెలికి తీయాల‌ని మిథున్ రెడ్డి కోరారు. దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

అయితే.. ఇలా చేయ‌డం ద్వారా కూట‌మి ప్ర‌భుత్వాన్ని నాయ‌కుల‌ను త‌మ దారిలో కి తెచ్చుకుని.. ప్ర‌భు త్వ దూకుడుకు, వైసీపీ నేత‌ల‌పై న‌మోదు చేస్తున్న కేసుల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇది జ‌రుగుతుందా?  మిథున్ రెడ్డి అభ్య‌ర్థ‌న‌ను కేంద్రం ఏమేర‌కు ప‌రిశీలిస్తుంది? అనేది చూడాలి. అయితే… ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. రాష్ట్రంలోని ప్ర‌భుత్వంపై కేంద్రం సానుకూలంగానే ఉన్న‌ద‌రిమిలా.. సీబీఐ విష‌యంలో కేంద్రం మౌనంగా ఉండే అవ‌కాశం ఉంది.

ఒక‌వేళ ఈ విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుంటే.. ఇప్ప‌టికే వెలుగులోకి వ‌చ్చిన వైసీపీహ‌యాం నాటి మ‌ద్యం కుంభ‌కోణాన్ని కూట‌మి ప్ర‌భుత్వం తెర‌మీద‌కి తెచ్చే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా.. దీనిపైనా సీబీఐని వేయాల‌ని ఇప్ప‌టికే కోరిన దరిమిలా.. మ‌రింత ఒత్తిడి పెంచే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల కులు చెబుతున్నారు. వాస్త‌వానికి గ‌తంలోనే ఈ విష‌యాన్ని సీబీఐకి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కోరినా.. కేంద్రం ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి క‌నుక న‌కిలీ మ‌ద్యం కుంభ‌కోణంపై ప‌ట్టుబ‌డితే.. తాము కూడా వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణంపై ప‌ట్టుబ‌డ‌తామ‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on October 10, 2025 7:52 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Midhun Reddy

Recent Posts

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

9 minutes ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

16 minutes ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

25 minutes ago

యాటిట్యూడ్ స్టార్: మృణాల్ తో డేట్.. శ్రీలీలతో పెళ్లట..!

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…

1 hour ago

‘జగన్ కు అధికారంలో రెడ్లు.. లేనపుడు కాపులు కావాలి’

జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…

1 hour ago

పరీక్షలో కథ రాసిన హీరో.. కట్ చేస్తే..!

డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…

2 hours ago