Political News

జూబ్లీహిల్స్‌కు టీడీపీ దూరం.. అంతేకాదు..!

ఏపీ అధికార కూటమిని ముందుండి నడిపిస్తున్న టీడీపీ.. తెలంగాణ విషయంలో కీలక, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతంలో అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నుంచి తక్కువగా దూరం ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవానికి, గత ఏడాది, ఈ ఏడాది కూడా.. తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీ ఏ ఎన్నికలోను పోటీకి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.

దీంతో స్థానికంగా ఉన్న తెలంగాణ టీడీపీ నాయకులు జూబ్లీహిల్స్‌పై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఒకప్పుడు జూబ్లీహిల్స్ గుర్తింపు పొందింది. పైగా, సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా కూడా దీనికి పేరుంది. కాబట్టి, టీడీపీ ఇక్కడ పోటీ పడ్డా.. పార్టీ గెలుపు లేదా ఓటములు ఏ విధంగా ఉన్నా.. పుంజుకోవడానికి, తన అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే అనుకున్నారు. గత నెలలో చంద్రబాబు హైదరాబాదులో పర్యటించినప్పుడు కూడా ఇదే విషయం చర్చకు వచ్చింది. “ఎవరికీ మద్దతు ఇవ్వడం ఎందుకు? మనమే పోటీ చేద్దాం,” అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు.. అసలు ఎవరికీ మద్దతు ఇవ్వరాదని చంద్రబాబు నిర్ణయించారు. సహజంగా, ఈ నిర్ణయం బీజేపీని బాధించేది. ఎందుకంటే, ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాంటిది, తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ పోటీ చేయకపోయినా.. పొత్తు ధర్మాన్ని (ఏపీ, కేంద్రం) పాటిస్తూ తమకు మద్దతు ఇస్తారని బండి సంజయ్ వంటివారు ఏపీలో పర్యటించినప్పుడు పేర్కొన్నారు. వాస్తవానికి టీడీపీ నేతలూ అదే అనుకున్నారు.

కానీ అనూహ్యంగా చంద్రబాబు జూబ్లీహిల్స్‌లో ఎవరికీ మద్దతు ఇవ్వరని తేల్చి చెప్పారు. దీనికి కారణాలు ఏవైనా ఉన్నా.. బీజేపీ నాయకులు హర్ట్ అవడం ఖాయం. దీన్నిబట్టి, చంద్రబాబు నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. తమకు అన్యాయం చేయకూడదనే, ఆయన అండ ఉండే అవకాశం ఉందని కమల్ నాథులు లెక్కలు వేసుకున్నారు.

ఇక, జూబ్లీహిల్స్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 13న రానుంది. తద్వారా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో టీడీపీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో పెట్టకపోయినా.. ఆ పార్టీ మద్దతు కోసం వేచి ఉన్న కొన్ని పార్టీలను మాత్రం హర్ట్ చేసిందని చెప్పాలి.


This post was last modified on October 8, 2025 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

30 minutes ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

3 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

4 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

5 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

6 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

6 hours ago